మహిళా కమిషన్ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మ డిమాండ్
అమరావతి,అక్టోబర్ 22 (ఆంధ్రపత్రిక): జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్ల వ్యాఖ్య లపై ఏపీ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహ రించుకోవాలని అలాగే మహిళలకు క్షమాపణ చెప్పాలని మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. ’జనసేన అధినేత పవన్ చేసిన వ్యాఖ్యలు బాధించాయి. భరణం ఇస్తే భార్యను వదిలించుకోవచ్చని ఆయన చేసిన వ్యాఖ్యలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అలాగే భరణం ఇచ్చి విూరూ మూడు పెళ్లిళ్లు చేసుకోవాలన్న వ్యాఖ్యలను పవన్ ఉపసంహరించు కోవాలి. భార్యను వదిలించుకుంటూ పోతే మహిళలకు భద్రత ఉంటుందా? మహిళలను ఉద్దేశించి స్టెప్నీ అనే పదం ఉపయోగించడం మరింత ఆక్షేపణీయం అన్నారు. ఎవరి జీవితంలో అయినా 3 పెళ్లిళ్లుచేసుకోవాల్సి వస్తే కచ్చితంగా వ్యతిరేక అంశమే. కోట్ల రూపాయల భరణం, విడాకులు ఇచ్చి విూరు చేసుకోండి అనడం సాధారణ విషయం కాదు. ఒక సినిమా హీరోగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా మూడు పెళ్లిళ్లపై విూ మాటలు సమాజంపై ప్రభావం చాలా ప్రభావం చూపుతాయి. విూ వ్యాఖ్యలు మహిళల భద్రతకు పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్ వివరణ కోసం ఏపీ మహిళా కమిషన్ ఎదురుచూస్తుందని వాసిరెడ్డి పద్మ తెలి పారు. తన మూడు పెళ్లిళ్ల విషయంపై వైస్సార్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చే పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. భరణం ఇచ్చి విూరూ మూడు పెళ్లిళ్లు చేసుకోండంటూ వైసీపీ నాయకులపై పవన్ ఇటీవల విరుచుకుపడ్డారు. దీనిపై ఏపీ సీఎం జగన్తో పాటు వైసీపీ నాయకులు కూడా గట్టిగా బదులిచ్చారు. పవన్ వ్యాఖ్యలు మహిళల భద్రతకు ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. తాజాగా మహిళా కమిషన్ కూడా జనసే నాని వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసులు కూడా జారీ చేసింది. దీనిపై మాట్లాడిన వాసిరెడ్డి పద్మ నోటీసులపై పవన్ వివరణ ఇవ్వకపోతే చూస్తూ ఊరు కోమన్నారు.’ పవన్ కళ్యాణ్ క్షమించరాని తప్పు చేశారు. దీన్ని కూడా జనసేన ,టీడీపీ నేతలు సమర్దిస్తున్నారు. మహిళ జీవితాన్నీ భరణంతో వెళకట్టగలరా 3 పెళ్లిళ్లు చేసుకున్న..30 మందితో ఉన్నా వ్యక్తిగత చౌకబారుతనంగా మాట్లాడారు. పెళ్లి అనేది..భార్యాభర్తల బం ధం. పవన్ బాద్యతలేకుండా మాట్లాడడపై వివరణ ఇవ్వాలన్నారు. మహిళలకు క్షమాపణ చెప్పి , పవన్ వాఖ్యలను ఉపసంహరించు కోవాలని, రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులకు పవన్ సమాధానం చెప్పాలన్నారు.. వివరణ ఇవ్వకపోతే చూస్తూ ఊరుకోం అని వాసిరెడ్డి పద్మ తెలిపారు.