అమరావతి, అక్టోబర్ 21 (ఆంధ్రపత్రిక): విశాఖపట్నంలో అరెస్టయిన జనసేన నాయకులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం, మరో ముగ్గురిని అరెస్టు చేయొద్దని ఆదేశించడం పట్ల ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు.ఈకేసులో జైలులో ఉన్న 9మంది నాయకులకు ఊరట లభించిందన్నారు. ఈనెల 15 నుంచి 17వరకు విశాఖలో ప్రభుత్వ ప్రాయోజిత అలజడి ఏవిధంగా ఉందో రాష్ట్ర ప్రజలంతా చూశారని, అక్రమ కేసుల విషయంలో తాము న్యాయపోరాటం మెదలుపెట్టామని చెప్పారు.ఈ సందర్భంగా హైకోర్టుకు కృతజ్ఞతలు తెలిపిన పవన్.. తాము న్యాయ వ్యవస్థపైనే నమ్మకం ఉంచామని తెలిపారు. అక్రమ కేసుల వల్ల తమ పార్టీ నాయకులు కోన తాతారావు, సుందరపు విజయ కుమార్, సందీప్ పంచకర్ల, కొల్లు రూప, పీవీఎస్ఎస్ఎన్ రాజు, పీతల మూర్తి యాదవ్, చిట్టిబిల్లి శ్రీను, రాయపురెడ్డి కృష్ణ, జి.శ్రీనివాస పట్నాయక్ జైలు పాలయ్యారని… వీరిని పాలకపక్షం వేధింపులకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపైనా న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి అభియోగాలు ఎదుర్కొంటున్న పార్టీ నాయకులు టి.శివశంకర్, బొలిశెట్టి సత్య, డాక్టర్ రఘును అరెస్టు చేయొద్దని ఉన్నత న్యాయస్థానం చెప్పిందన్నారు. విధివిధానాలకు కట్టుబడి, చట్టాన్ని గౌరవించే తమ పార్టీ నాయకులు, శ్రేణులకు హైకోర్టు తీర్పు ఎంతో ఊరట కలిగించిందన్నారు. ఈ కేసులో జైలు పాలైన వారి కుటుంబ సభ్యులు ఎంత ఆవేదనకు లోనయ్యారో తనకు తెలుసునని, వారందరినీ త్వరలో కలుస్తానని చెప్పారు. అక్రమ కేసుల వల్ల బాధితులైన వారందరికీ ఊరట లభించే వరకు న్యాయపోరాటం కొనసాగిస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!