రంగారెడ్డి,అక్టోబర్31(ఆంధ్రపత్రిక): టిఆర్ఎస్ పార్టీతో ఎలాంటి అవగాహన కానీ.. పొత్తు గానీ పెట్టుకునే ప్రసక్తే లేదని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. ఈ విషయంలో రాష్ట్ర నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం.. వారి సూచించిన విధంగానే ముందుకు వెళ్తామంటూ తేల్చిచెప్పారు. బీజేపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి తీరుతుందని పేర్కొన్నారు. గుజరాత్, హిమాచల్ప్రదేశ్ ఎన్నికల్లో పోరాటంపై పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని.. గెలిచి తీరుతామని రాహుల్ చెప్పారు. ’భారత్ జోడో యాత్ర’లో భాగంగా రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్లో నిర్వహించిన విూడియా సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. టీఆర్ఎస్ తో పొత్తు ఉండొద్దన్నది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయమని.. దానిని సంపూర్ణంగా స్వాగతిస్తున్నట్లు వెల్లడిరచారు. కేంద్రంలో బీజేపీ, తెలంగాణలో టీఆర్ఎస్ కొద్దిమంది వ్యాపారవేత్తలకే లాభం చేస్తున్నాయంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే పార్లమెంట్ ఎన్నికలు విభజన శక్తులు, సంఘటిత శక్తులకు మధ్య జరిగే పోరాటంగా ఉండబోతు న్నాయంటూ పేర్కొన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రజాధనాన్ని దోచుకుంటున్నాయని.. ఉప ఎన్నికకు రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నా యంటూ మండిపడ్డారు. ఆ రెండు పార్టీలకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది..అంటూ ప్రశ్నించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలో విభజన రాజకీయాలు చేస్తున్నాయంటూ మండిపడ్డారు. రాజ్యాంగ వ్యవస్థలను కేంద్రం నాశనం చేస్తోందని.. రాహుల్గాంధీ విమర్శించారు. బీజేపీ సిద్దాంతాలను తప్పు పట్టిన రాహుల్.. కాంగ్రెస్ సిద్దాంతాలకు ఇది పూర్తి విరుద్ధమంటూ విమర్శించారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకుంటూ.. భారత్ జోడో యాత్రతో ప్రజల్లో చైతన్యం నింపుతాం అంటూ రాహుల్ పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ఒకే విధానాన్ని అవలంబిస్తున్నాయని.. సంపదను కొద్ది మంది వ్యాపారుల చేతుల్లో పెడుతున్నారంటూ రాహుల్ పేర్కొన్నారు. అవినీతిమయమైన, ప్రజాధనాన్ని లూటీ చేసే పార్టీలతో పొత్తు ఉండదని స్పష్టంచేశారు. రాజకీయంగా కొందరు నాయకులు ఎవరికి వారు తామది పెద్ద పార్టీగా ఊహించుకోవచ్చు. టీఆర్ఎస్ కూడా తమకు తాము నేషనల్ పార్టీ, గ్లోబల్ పార్టీ అని ఊహించుకోవడంలో తప్పులేదంటూ రాహుల్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తెలిపారు. నితీష్కుమార్ తో మాట్లాడాలనుకుంటే అది ఆయన ఇష్టమంటూ రాహుల్ పేర్కొన్నారు.అవినీతి, వైఖరి, విధానాలకు మేం వ్యతిరేకం.. తెలంగాణ ప్రజలను లూటీచేస్తోంది.. భూములు లాగేసుకుంటోందంటూ రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ విూడియా సమావేశానికి ముందు.. గుజరాత్లో ప్రమాదంపై దిగ్భాంతి వ్యక్తంచేశారు రాహుల్ గాందీ. 2 నిమిషాలపాటు మౌనం పాటించారు
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!