హీరో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా ‘టిల్లు స్క్వేర్ ‘.. గత నెల చివరిలో విడుదలైంది.. ఇప్పటికి సినిమాకు క్రేజ్ తగ్గలేదు..
భారీ కలెక్షన్స్ ను అందుకుంటూ దూసుకుపోతుంది.. 100 కోట్ల గ్రాస్ ను రాబట్టి సరికొత్త రికార్డును బ్రేక్ చేసింది.. గతంలో వచ్చిన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా వచ్చింది.. ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది.. ఇక ఈ సినిమా త్వరలో ఓటీటీలోకి కూడా రాబోతుంది..
హీరో కామెడీ టైమింగ్, హీరోయిన్ తో అతడి కెమిస్ట్రీ అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఇప్పటివరకు తెలుగులో చాలా పద్దతిగా సాఫ్ట్ రోల్ చేస్తూ వచ్చిన అనుపమ ఈ సినిమాలో కాస్త బోల్డ్ గా కనిపించింది. సిద్దు పంచ్ డైలాగులు, కామెడీ టైమింగ్ హిలేరియస్గా థియేటర్లలో నవ్విస్తున్నాయి.. ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించాడు.. ఇక నేహా శెట్టి టిల్లు ఈ సినిమాలో గెస్ట్ రోల్లో కనిపించింది. టిల్లు ఫ్రాంచైజ్లో భాగంగా మూడో పార్ట్ కూడా రాబోతోందని టీమ్ ప్రకటించింది.. ఆ సినిమాకు టిల్లు క్యూబ్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు.. త్వరలోనే ఈ సినిమా తెరకేక్కనుందని సమాచారం..
ఇదిలా ఉండగా.. సినిమా నెలలోపే ఓటీటీలోకి రానుందని తెలుస్తుంది.. ఈ నెల 26 న సినిమా ఓటీటి స్ట్రీమింగ్ కానుంది.. రిలీజ్కు ముందే టిల్లు స్క్వేర్ డిజిటల్ రైట్స్ను నెట్ఫ్లిక్స్ దక్కించుకున్నది. ఫ్యానీ రేటుకు ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయినట్లు సమాచారం. ఏప్రిల్ 26 నుంచి టిల్లు స్క్వేర్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుందని టాక్ .. త్వరలోనే ఈ సినిమా ఓటీటీ డేట్ పై ప్రకటన వెలువడనుంది..