ప్రభుత్వానికి హైకోర్టు సూచనలు
అమరావతి,అక్టోబర్27(ఆంధ్రపత్రిక): టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ కేసులో ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు సూచించింది. సీఎం జగన్ భార్య భారతిపై అనుచిత పోస్టు పెట్టిన వ్యవహారంలో ఏపీసీఐడీ పోలీసులు విజయ్పై కేసు నమోదు చేసి నోటీసులు అందజేసిన విషయం తెలిసిందే. ఈ నెల 22న విజయ్కు మరోసారి సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్లోని ఆయన నివాసానికి నోటీసు అంటించారు. ఈ నోటీసును విజయ్ తరపు న్యాయవాది హైకోర్టులో సవాల్ చేశారు. గురువారం న్యాయమూర్తి ముందు విజయ్ తరపు న్యాయవాది, ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. పిటిషనర్ నివాసం నర్సీపట్నంలో ఉంటే హైదరాబాద్లో నోటీసులు ఇవ్వడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. ఐటీడీపీ కోసం ఉపయోగిస్తున్న బడెట్స్ను తేవాలని ప్రభుత్వ న్యాయవాది కోరగా.. ఐటీడీపీతో తమకు సంబంధం లేదన్న విజయ్ తరపు లాయర్ వాదించారు. సీఐడీ నోటీసులో పేర్కొన్న కొన్ని అంశాలపై హైకోర్టు అభ్యంతరం తెలుపుతూ విచారణ సోమవారానికి వాయిదా వేసింది.