- కెసిఆర్ ఇచ్చిన హామీలు పక్కన పెట్టారు
- తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చడంలో సిఎం కెసిఆర్ విఫలం
- మాట్లాడక పోతే ఏ సమస్య తీరదు..
- ఓటు మీ జీవితాలను మార్చే ఆయుధం..
- కేసీఆర్ తీరుపౖౖె ప్రతిపక్షాలు ఏనాడూ పోరాటం చేయలేదు: షర్మిల
- ఏ ఒక్క నాయకుడు ప్రజల పక్షాన నిలబడలేదు
- నర్సాపూర్ పాదయాత్రలో షర్మిల
మెదక్,సెప్టెంబర్28(ఆంధ్రపత్రిక): ప్రజల పక్షాన నిలబడేందుకే పార్టీ పెట్టానని వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చడంలో సిఎం కెసిఆర్ విఫలమ య్యారని అన్నారు. ఇచ్చిన హావిూలను తుంగలో తొక్కారని అన్నా రు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని నర్సాపూర్ మండలం నట్నాయ్యపల్లి గ్రామంలో పర్యటించిన వైఎస్ షర్మిల… కొట్లాడక పోతే ఏదీ రాదని చెప్పారు. మాట్లాడక పోతే ఏ సమస్య తీరదన్న ఆమె… ఓటు అనేది విూ చేతిలో ఉన్న ఆయుధమని… విూ జీవితాలను మార్చే ఆయుధమన్నారు. వైఎస్సార్ ఏ పథకం పెట్టినా ప్రజల కోసమే పెట్టాడన్న షర్మిల.. అలాంటి వైఎస్సార్ నాయకత్వం మళ్ళీ రావాలని పిలుపునిచ్చారు. ఈ కేసీఆర్కో లేక బీజేపీకో, కాంగ్రెస్ కో ఓటేస్తే విూ జీవితం మారదని షర్మిల చెప్పా రు. 8 ఏళ్లుగా కేసీఆర్ మోసం చేస్తే.. బీజేపీ, కాంగ్రెస్ కూడా ప్రజలకు చేసింది మోసమేనని ఆరోపించారు. కేసీఆర్ అరాచ కాలపై ఏనాడూ ప్రతిపక్షాలు పోరాటం చేయలేదన్న షర్మిల… ఏ ఒక్క నాయకుడూ ప్రజల పక్షాన నిలబడిరది లేదని విమర్శించారు. రుణమాఫీ జరగకపోతే ఎవరు కొట్లాడారు..? డబుల్ బెడ్ రూం ఇల్లులు ఇవ్వకపోతే ఎవరు కొట్లాడారు..?` ఉద్యోగాలు ఇవ్వక పోతే ఎవరు కొట్లాడారు..? అంటూ వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం కురిపిస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు.