ఓవైపు ప్రత్యర్థి పార్టీలపై విమర్శనస్త్రాలు ఎక్కుపెడుతూనే మరోవైపు వరాల జల్లులు కురిపిస్తున్నారు. అటు అధికార బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ సంక్షేమ పథకాలను ప్రకటిస్తూ వస్తున్నాయి. ఇక తామేమి తక్కువ కాదన్నట్లు బీజేపీ సైతం హామీలు కురిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ తాము అధికారంలోకి వస్తే తెలంగాణలో కొన్ని ప్రాంతాల పేర్లను మారుస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దీనికి కొనసాగింపుగా…
తెలంగాణలో ఎన్నికల వేడి రోజురోజుకీ పెరుగుతోంది. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ రక్తి కడుతోంది. ఎన్నికలకు ఇంకా కేవలం ఆరు రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. ఇక ప్రచారానానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది.28వ తేదీ సాయంత్రంతో ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలోనే పార్టీలన్నీ తమ శక్తిమేరకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఓవైపు ప్రత్యర్థి పార్టీలపై విమర్శనస్త్రాలు ఎక్కుపెడుతూనే మరోవైపు వరాల జల్లులు కురిపిస్తున్నారు. అటు అధికార బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ సంక్షేమ పథకాలను ప్రకటిస్తూ వస్తున్నాయి. ఇక తామేమి తక్కువ కాదన్నట్లు బీజేపీ సైతం హామీలు కురిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ తాము అధికారంలోకి వస్తే తెలంగాణలో కొన్ని ప్రాంతాల పేర్లను మారుస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దీనికి కొనసాగింపుగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరో ఆసక్తికర హామీని ఇచ్చారు.
ప్రచారంలో భాగంగా హైదరాబాద్ వచ్చిన అస్సాం సీఎం.. చార్మినార్ వద్ద నిర్వహించిన ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే అరగంటలో హైదరాబాద్ పేరును మారుస్తామని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ పేరును భాగ్య నగర్గా మారుస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ విషయంలో ఎవరూ పెద్దగా అభ్యంతరం కూడా చెప్పరని హేమంత్ ధీమా వ్యక్తం చేశారు.
ఇక యూసీసీపై కూడా హిమంత బిశ్వ శర్మ స్పందించారు. 2024 ఫిబ్రవరి నాటికి అస్సాంలో యూసీసీ అమల్లోకి తీసుకొస్తామని తెలిపారు. ఇది అమల్లోకి వస్తే.. ఒక భర్త ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను కలిగే ఉండే అవకాశం ఉండదని బిశ్వ అన్నారు. ఈ చట్టం ప్రకారం.. పెళ్లయిన వ్యక్తి మరో మహిళను పెళ్లి చేసుకోవాలనుకునే ముందుగా తన భార్యకు విడాకులు ఇవ్వాల్సిందేనంటూ చెప్పుకొచ్చారు. మరి హైదరాబాద్ పేరు మార్పుపై బీఆర్ఎస్ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.