17 విడుదలవుతున్న ఊర్వసివో రాక్షసివో
అక్టోబర్ 14 (ఆంధ్రపత్రిక): టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ హీరోగా నిలదొక్కుకోవడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. కథా బలమున్న సినిమాలను చేస్తున్నా.. కమర్షియల్గా హిట్ సాధించలేకపోతున్నాడు. ఈయన చివరిగా 2019లో ’ఏబీసీడీ’ అనే మలయాళ రీమేక్ సినిమాలో నటించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్గా మిగిలింది. ఈ క్రమంలో దాదాపు మూడేళ్ళు గ్యాప్ తీసుకుని ’ఊర్వసివో రాక్షసివో’ అనే రోమ్`కామ్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఇటీవలే రిలీజైన టీజర్కు విశేష స్పందన వచ్చింది. రాకేశ్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 4న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లను ఇస్తున్నారు. కాగా చిత్రబృందం తాజాగా మరో అప్డేట్ను ప్రకటించారు. ఈ సినిమాలోని ’మాయారే’ అంటూ సాగే సెకండ్ సింగిల్ను అక్టోబర్ 17న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రాహుల్ సిప్లీగంజ్ ఆలపించిన ఈ పాటను, కాసర్య శ్యామ్ రచించాడు. ఇటీవలే విడుదలైన ’దీంతనన’ సాంగ్కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అనూప్రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని జీఏ`2 పిక్చర్స్, శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. శిరీష్కు జోడీగా అను ఇమాన్యూయేల్ హీరోయిన్గా నటించింది. గతేడాదే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పలు కారణాలతో విడుదల వాయిదా పడుతూ వచ్చింది.