గన్నవరం: సెప్టెంబర్ 2, 2023 ఆంధ్రపత్రిక :
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ ఏపీలో మంగళగిరి మండలం నీరుకొండ లోఎస్ ఆర్ ఎమ్ విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమానికి హాజరయ్యేందుకు శనివారం ఉదయం చెన్నై నుంచి విమానంలో గన్నవరం ఎయిర్పోర్టు చేరుకున్నారు.
కృష్ణజిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కు పుష్పగుచ్చం అందజేసి గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికారు.
విమానాశ్రయ డైరెక్టర్ ఎం ఎల్ కె రెడ్డి, ప్రోటోకాల్ ఏడి విజయ్ కుమార్, స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
అనంతరం తెలంగాణ గవర్నర్ రోడ్డు మార్గంలో నీరుకొండ బయలుదేరి వెళ్లారు.
–జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, కృష్ణాజిల్లా మచిలీపట్నం వారిచే జారీ చేయబడింది