మోపిదేవి
Sri Durga Koteswara Swamy’s marriage mahotsavam is a festival of eyes
మోపిదేవి మండల పరిధిలోని కే కొత్తపాలెం గ్రామంలో కృష్ణా నది తీరంలో కొలువుతీరిన శ్రీ దుర్గా కోటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా, పండగ వాతావరణం లో జరిగింది.
ఆలయ వ్యవస్థాపకులు రామిశెట్టి రామకృష్ణ, నాగరాణి దంపతుల ఆధ్వర్యంలో ఆలయ కమిటీ చైర్మన్ చందన రామచంద్రయ్య, కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఆలయ ఆరవ వార్షికోత్సవ అలాగే మహాశివరాత్రి పర్వదిన కార్యక్రమాలు ఆలయంలో ఘనంగా నిర్వహిస్తున్నారు.
కార్యక్రమాలలో మూడవ రోజు అయిన శనివారం రాత్రి శ్రీ స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని అలాగే శ్రీ స్వామివారికి లింగోద్భవ అభిషేకము, అన్నాభిషేకాలను ఆలయ పండితుల వేదమంత్రోర్చనల మధ్య శాస్త్రవేత్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
నాలుగవ రోజైన ఆదివారం విగ్నేశ్వర పూజ, దుర్గా హోమం, అప మృత్యు హోమం, స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమ అర్చన, నిత్యబలిహరణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు రామకృష్ణ, నాగరాణి లు వెల్లడించారు.