భారీ సెట్టింగ్లతో అలరించిన సాంఘిక నాటకం
వేపాడ,పిబ్రవరి,09:- మండలంలోని నల్లబెల్లి గ్రామంలో శ్రీ భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామి కళ్యాణ తీర్థ మహోత్సవం మంగళ, బుధ, గురువారాల్లోవైభవంగా సాగింది. ఈ మూడు రోజులు గ్రామస్తులు వేలాదిమంది భక్తులు స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ధూప దీప నైవేద్యాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే మొక్కులు చెల్లించుకున్నారు. మూడవ రోజు తీర్థ మహోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం మధ్యాహ్నం ఏర్పాటుచేసిన ఎడ్ల పరుగు పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీల్లో పలు ప్రాంతాలకు చెందిన సుమారు 15 ఎడ్లబండ్లు పాల్గొనగా బెబ్బులి అనే సాంఘిక నాటకం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది.