చంద్రబాబుకు వినతిపత్రం అందజేసిన జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకుడు అద్దంకి బాబురావు
నాదెండ్ల మండలం,అక్టోబర్ 19 (ఆంధ్రపత్రిక): మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బుధవారం అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించే కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల గ్రామం విచ్చేసిన సందర్బంగా MRPS జిల్లా నాయకులు అద్దంకి బాబు మాదిగ ప్రస్తుతం జరుగుతున్న రాష్ట్ర రాజకీయ పరిస్థితులలో SCరిజర్వేషన్ల ABCD వర్గీకరణ పై మద్దతు తెలపాలని, 2024 లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ABCD వర్గీకరణను మేనిఫెస్టో లో ప్రధాన అంశంగా చేర్చాలని డిమాండ్ చేస్తూ మంద కృష్ణ మాదిగ నాయకత్వం లో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు అద్దంకి బాబు మాదిగ, ప్రత్తిపాటి కోటి మాదిగ, బిరుదు అశోక్ మాదిగ, ఫణి, నాని, అనిల్, సాగర్, ఏభినేజరు, డానీ, కొండే పోగు క్రాంతి తదితరులు ఉన్నారు