
తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం పేరును పునరుద్ధరించండి.
– జన చైతన్య వేదిక
సాహితీవేత్తలకు,కళా ప్రియులకు నిలయమైన గత 43 సంవత్సరాలుగా సాహితీ,సాంస్కృతిక సేవలు అందించిన తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రo పేరును మార్చి కళాక్షేత్రంగా పెట్టడం పట్ల జన చైతన్య వేదిక ఆంధ్ర ప్రదేశ్ కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది. తక్షణమే తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం పేరును పునరుద్దించాలని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. చారిత్రక కట్టడాల పేర్లను ఎలాంటి పరిస్థితుల్లోనూ మార్చరాదని, బతికి ఉన్న వారి పేర్లను వారు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ ఎలాంటి పథకాలకు గాని నిర్మాణాలకు గాని పెట్టరాదని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. పాత పేర్లను మార్చుకుంటా పోతే భవిష్యత్తులో దాతలు ఎవరూ ముందుకు రారని భవిష్యత్ తరాల కోసం ఎన్నో త్యాగాలతో తమ ఆస్తులు, సంపదలను దానం చేసిన వారిని మానవజాతి మరువరాదు. ప్రముఖ వైద్యులు డాక్టర్ తుమ్మలపల్లి హరి నారాయణ 1944లో 40వేలు విజయవాడ మున్సిపాలిటీకి దానం చేశారని విజయవాడలో కర్మల భవనాన్ని ఏర్పాటు చేశారని, శ్రీహరి నివాస్ పేరుతో పేద విద్యార్థుల వసతి గృహాన్ని నిర్మించారని, కనకదుర్గ అమ్మవారి మెట్ల నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించారని1945 లో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి 50వేల రూపాయలు విరాళంగా అందించిన డాక్టర్ తుమ్మలపల్లి పేరును తీసివేయడం ప్రముఖ వాగ్గేయ కారులు 1595 కృష్ణాజిల్లా మొవ్వలో జన్మించి 1660 వరకు తన జీవితంలో నాలుగు వేల కీర్తనలను రచించిన గొప్ప కవి క్షేత్రయ్య పేరు తొలగించడం దుర్మార్గపు చర్యగా భావిస్తున్నాము. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వెంటనే స్పందించి క్షేత్రయ్య పేరును తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంగా పునరుద్దించాలని డిమాండ్ చేస్తున్నాము ఈ మార్పుపై విచారణ జరిపి బాద్యులను శిక్షించాలని భవిష్యత్తులో ఇలాంటి దుర్మార్గపు చర్యలు జరగకుండా చూడాలని కోరుతున్నాము.
వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి
రాష్ట్ర అధ్యక్షులు
జన చైతన్య వేదిక