
టీడీపీకి చెందిన రైతు వేరుశనగ పంట ధ్వంసం
వైసీపీ నాయకుని దుర్మార్గం*
చేతికొచ్చే సమయంలో పంట నాసనం
ధ్వంసమైన పంటను పరిశీలించిన టీడీపీ నేతల బృందం
న్యాయం చేయకుంటే ఆందోళన ఉధృతం
శ్రీకాళహస్తి, ఫిబ్రవరి10(ఆంధ్ర పత్రిక): టీడీపీ కార్యకర్త భూమిపై అధికార పార్టీకి చెందిన ఓ నాయకుని కన్ను పడింది. ఎలాగైనా ఆ భూమిని సొంతం చేసుకోవాలని కుట్ర పన్నాడు. అతని అధికారుల అండతో రికార్డుల్లో నుంచి ఆ భూమి వివరాలు తొలగింపు చేశాడు. విషయం తెలుసుకుని ఉన్నత న్యాయస్థానం కి వెళ్లిన రైతు, యమ్ ఆర్ ఓ కి హైకోర్టు నోటీసులు ఇవ్వడంతో వెంటనే 4 ఎకరాల రైతు పేరిట ఆన్లైన్ నమోదు చేశారు. దుక్కిదున్ని ధ్వంసం చేశాడు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తొట్టంబేడు మండలంలో చోటుచేసుకున్న ఈ సంఘటనపై టీడీపీ నాయకులు భగ్గుమంటున్నారు. తొట్టంబేడు వారి చిట్టత్తూరు గ్రామానికి చెందిన మురళీకృష్ణారెడ్డికి పంచాయతీ పరిధిలోని తెల్లరాళ్లమిట్ట వద్ద పెద్దల నుంచి సంక్రమించిన భూమి ఉంది. టీడీపీకి చెందిన ఆయన ఆదర్శ రైతుగా ఎంపికై అవార్డును కూడా తీసుకున్నారు. సారవంతమైన ఈ భూమిలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇదే గ్రామంలో అధికార వైసీపీకి చెందిన గెడ్డం ఆనంద రెడ్డికి ఈ భూమిపై కన్నేశాడు. ఎలాగైనా ఆ భూమిని సొంతం చేసుకున్న కుట్రలు చేశాడు. పంట పెట్టుబడులకు గాను రైతు మురళీకృష్ణారెడ్డికి కొంత మొత్తం ఇచ్చిన ఖాళీ బాండ్లు, బ్యాంకు చెక్కులపై సంతకాలు తీసుకున్నారు. అధిక వడ్డీల పేరుతో ఎంత ఇచ్చినా ఇంకా బకాయి ఉందంటూ వేధించసాగాడు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు అందడంతో రికార్డులను తారుమారు చేసే ప్రయత్నంలో ఆన్లైన్లో భూముల వివరాలు తొలగింపజేశారు. ఇది తెలుసుకుని పలుమార్లు అధికారుల చుట్టు తిరిగినా ఫలితం లేకపోవడంతో రైతు మురళీకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. దీనితో కోర్టు వివరాలను వివరాలను ఆన్లైన్లో అధికారులు నమోదు చేశారు. కానీ ఆ అధికార పార్టీ నాయకుడు అప్పటి నుంచి మురళీకృష్ణారెడ్డిపై పగ పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో తన పదెకరాల భూమిలో వేసిన వేరుశనగ పంటను గురువారం రాత్రి రొటావేటర్ తో ఆరెకరాల పంటను దుక్కిదున్ని ధ్వంసం చేశాడు. ఉదయం పక్కపొలం రైతు పంట ధ్వంసం అయిన మురళీకృష్ణారెడ్డికి చెప్పడంతో ఇంటి నుంచి పరుగున వచ్చి నేలమట్టమైన పంటను చూసి బోరున విలపించాడు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ కార్యదర్శి గాలిచలపతి నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ నాయకుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. విచారించగా చిట్టత్తూరు గ్రామానికి చెందిన వైసీపీ నేత ఒకరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తేలింది. ఈ విషయమై టీడీపీ నాయకులు పోలీసులకు సమాచారమందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న తొట్టంబేడు ఎస్ఐ రాఘవేంద్ర నేలమట్టమైన పంటను పరిశీలించి రైతు మురళీకృష్ణారెడ్డిని విచారించారు. రాతపూర్వకంగా పోలీసులకు మురళీకృష్ణారెడ్డి పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశారు. న్యాయం జరిగింది. లేకుంటే తనకు ఆత్మహత్య తప్పదని స్పష్టం చేశారు. రైతు మురళీకృష్ణారెడ్డి పంటను నేతమట్టం చేసిన అధికార వైసీపీకి చెందిన నాయకునిపై నియంత్రణ చర్యలు చేపట్టేందుకు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వ్యాప్త ఆందోళనను ఉధృతం అని తెలియజేసారు. ఈ విషయమై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం టిడిపి ఇంచార్జి బొజ్జల సుధీర్ రెడ్డి, బొజ్జల బృందమ్మ చర్వనీయులు రైతు మురళీకృష్ణ రెడ్డితో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ దారుణానికి గురైన వారిపై శిక్ష పడే వరకు పోరాడుదామని భరోసా ఇచ్చారు. ధ్వంసమైన పంటను పరిశీలించిన టీడీపీ బృందంలో తెలుగుదేశం పార్టీ తొట్టంబేడు మండలాధ్యక్షుడు గాలి మురళీనాయుడు, వేణురెడ్డి, ప్రతాప్, బాలాజీ, మణి, బాబు, సురేష్, జనార్దన్, ముని చంద్ర, దానంజయులు, బత్తయ్య,వెంకటయ్య, కల్పన,