రీసెంట్ ఇంటర్వ్యూలో రాజమౌళి అప్కమింగ్ సినిమాల గురించి ఇంట్రస్టింగ్ విషయాలు రివీల్ చేశారు రచయిత విజయేంద్ర ప్రసాద్. ప్రజెంట్ మహేష్ మూవీ వర్క్లో బిజీగా ఉన్న జక్కన్న, ప్యారలల్గా ట్రిపులార్ సీక్వెల్ గురించి కూడా ఆలోచన చేస్తున్నారని చెప్పారు. అంతేకాదు పార్ట్ 2కు రాజమౌళి దర్శకుడిగా వ్యవహరించకపోవచ్చన్న హింట్ ఇచ్చారు.
ట్రిపులార్ రిలీజ్ తరువాత రాజమౌళి గ్లోబల్ డైరెక్టర్గా మారిపోయారు. దీంతో జక్కన్న సినిమాల గురించి ఇంటర్నేషనల్ లెవల్లో డిస్కషన్ జరుగుతోంది. ఈ సమయంలో మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఫిలిం సర్కిల్స్లో ట్రెండ్ అవుతోంది. త్వరలో జక్కన్నకు వారసుడు రాబోతున్నాడన్నది ఫిలిం నగర్లో నయా డిస్కషన్. రీసెంట్ ఇంటర్వ్యూలో రాజమౌళి అప్కమింగ్ సినిమాల గురించి ఇంట్రస్టింగ్ విషయాలు రివీల్ చేశారు రచయిత విజయేంద్ర ప్రసాద్. ప్రజెంట్ మహేష్ మూవీ వర్క్లో బిజీగా ఉన్న జక్కన్న, ప్యారలల్గా ట్రిపులార్ సీక్వెల్ గురించి కూడా ఆలోచన చేస్తున్నారని చెప్పారు. అంతేకాదు పార్ట్ 2కు రాజమౌళి దర్శకుడిగా వ్యవహరించకపోవచ్చన్న హింట్ ఇచ్చారు.
జక్కన్న డైరెక్ట్ చేయకపోతే ట్రిపులార్ 2ని ఎవరు రూపొందిస్తారు? సెంకడ్ ఇన్స్టాల్మెంట్ గ్లోబల్ రేంజ్ అన్న టాక్ ఉంది కాబట్టి హాలీవుడ్ డైరెక్టర్స్ పేర్లు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. కానీ టాలీవుడ్లో మాత్రం మరో ఇంట్రస్టింగ్ టాపిక్ ట్రెండ్ అవుతోంది. ఆల్రెడీ బాహుబలి సినిమాతో కొడుకు కార్తికేయను సెకండ్ యూనిట్ డైరెక్టర్గా పరిచయం చేశారు రాజమౌళి. ట్రిపులార్ సినిమా విషయంలో అయితే అంతా తానే అయి వ్యవహరించారు జక్కన్న వారసుడు. అందుకే ట్రిపులార్ సీక్వెల్తో కార్తికేయను పూర్తి స్థాయి దర్శకుడిగా ఇంట్రడ్యూస్ చేస్తారా అన్న చర్చ జరుగుతోంది.
రాజమౌళి సినిమాల ప్రమోషన్ విషయంలో కార్తికేయ కీ రోల్ ప్లే చేస్తుంటారు. ట్రిపులార్కు ఆస్కార్ రావటం వెనుక ఈ యంగ్ టెక్నీషియన్ కృషి చాలానే ఉంది. అందుకే విశ్వ వేదిక మీద కార్తికేయకు మాత్రమే థ్యాంక్స్ చెప్పారు కీరవాణి. ప్రస్తుతానికి జక్కన్న లైనప్ విషయంలో ఎలాంటి క్లారిటీ లేకపోయినా వారసుడి ఎంట్రీ మాత్రం ఫిలిం నగర్లో హాట్ టాపిక్ అవుతోంది. మరి ఈ విషయంలో రాజమౌళి కాంపౌండ్ నుంచి క్లారిటీ ఎప్పుడొస్తుందో చూడాలి.