కర్నూలు,అక్టోబరు 18 (ఆంధ్రపత్రిక): కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాద యాత్ర మంగళవారం ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించింది. ఈ రోజు నుంచి నాలుగు రోజులు పాటు ఏపీలో రాహుల్ పాదయాత్ర సాగనుంది. ఏపీ సరిహద్దు గ్రామమైన హాలహర్వి నుంచి రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రారంభమయింది. చత్రగుడి హనుమాన్ ఆలయం నుంచి రాహుల్ పాదయాత్ర చేయనున్నారు. ఆలూరు సిటీలోకి పాదయాత్ర ప్రవేశించింది. రాత్రికి చాగి గ్రామంలో నైట్ హాల్ట్ ఉంటుందని కాంగ్రెస్ నేతలు వెల్ల డిరచారు. ఈ పాదయాత్రలో ఏపీ నాయకులతోపాటు.. తెలంగాణకు చెందిన నేతలు కూడా పాల్గొంటున్నారు. రాహుల్ పాదయాత్ర నేపథ్యంలో కర్నూలు జిల్లా ఆలూరు మండలం హాలహర్వి వద్ద భారీ ఏర్పాట్లు, పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. కన్యాకుమారి నుంచి ప్రారంభమైన భారత్ జోడోయాత్ర 41 రోజులుగా కొనసాగుతోంది. ఈ రోజు నుంచి 21వ తేదీ వరకు నాలుగు రోజులు పాటు ఏపీలో భారత్ జోడోయాత్ర జరగనుంది. ఆంధప్రదేశ్ లో 96 కిలో విూటర్ల మేర రాహుల్ పాదయాత్ర సాగనుంది. ఏపీకి చెందిన కీలక నాయకులంతా ఈ యాత్రలో పాల్గొన్నారు.చాగి నుంచి బుధవారం ఉదయం 6.30 నిమిషాలకు రాహుల్ యాత్ర ప్రారంభం కానుంది. ఎమ్మిగనూరు చెన్నాపురం క్రాస్ వద్ద రాహుల్ రాత్రి బస చేస్తారు. మరుసటి రోజు 20వ తేదీ ఉదయం 6.30 నిమిషాలకు పాదయాత్ర ఎమ్మిగనూరు నుంచి ప్రారంభమై కల్లుదేవకుంట గ్రామం వరకు కొనసాగనుంది. 21న మంత్రాలయం గుడి సర్కిల్ నుంచి మాధవరం బ్రిడ్జి వరకు సాగనుంది. భారత్ జోడో యాత్ర 23న తెలంగాణలోకి ప్రవేశించనుంది. నారాయణపేట జిల్లా శివారులోని కృష్ణ మండలం గూడవల్లూరు గ్రామంలోకి యాత్ర ప్రవేశిస్తుంది. ఆ రోజు సాయంత్రానికి మక్తల్ చేరుకొని.. దీపావళి సందర్భంగా 24, 25 తేదీల్లో పాదయాత్రకు రాహుల్ గాంధీ విరామం ఇవ్వనున్నారు. ఆయన బస కూడా అక్కడే ఉండనుంది. ఆ తర్వాత 26 నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!