Unified Payments Interface: దేశంలో 2016 నాటి నుంచి యూపీఐ సేవల వినియోగం క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. డిజిటల్ ట్రాన్సక్షన్స్ని కేవలం భారత్కి మాత్రమే పరిమితం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో విస్తరించాలని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్
My India My Life Goals
తెలంగాణ
వెబ్ స్టోరీస్
జాతీయం
పాలిటిక్స్
క్రైమ్
ట్రెండింగ్
హెల్త్
బిజినెస్
ఫోటోలు
లైఫ్ స్టైల్
టెక్నాలజీ
ఆధ్యాత్మికం
అంతర్జాతీయం
ఎన్నికలు
#INDvsWI#TelanganaElections#PawanKalyanVarahiYatra#ICCWorldCup2023#Adipurush#Weather#CMKCR#PMModi#Money9#CoronaTracker#FuelTracker#GlobalIndians
Search ..
తాజా వార్తలు
వెబ్ స్టోరీస్
ఎంటర్టైన్మెంట్
హ్యుమన్ ఇంట్రెస్ట్
రాశి ఫలాలు
ఆధ్యాత్మికం
ట్రెండింగ్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయం
క్రీడలు
క్రైమ్
బిజినెస్
పాలిటిక్స్
హెల్త్
కెరీర్ & ఉద్యోగాలు
అంతర్జాతీయం
ఫోటో గ్యాలరీ
వీడియోలు
సైన్స్ అండ్ టెక్నాలజీ
లైఫ్ స్టైల్
ఎన్నికలు – 2023
విశ్లేషణ
మనీ 9
బడ్జెట్ 2023
CWG
Telugu News » World » India and France have agreed to use UPI in France, says PM Modi while touring in the European Country
PM Modi: ఇకపై ఫ్రాన్స్లోనూ యూపీఐ సేవలు.. ఇండియన్ కరెన్సీలోనే చెల్లింపులు.. ఎన్ఆర్ఐల సమావేశంలో ప్రధాని మోదీ..
శివలీల గోపి తుల్వా | Updated on: Jul 14, 2023 | 6:44 AM
Unified Payments Interface: దేశంలో 2016 నాటి నుంచి యూపీఐ సేవల వినియోగం క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. డిజిటల్ ట్రాన్సక్షన్స్ని కేవలం భారత్కి మాత్రమే పరిమితం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో విస్తరించాలని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం..
PM Modi: ఇకపై ఫ్రాన్స్లోనూ యూపీఐ సేవలు.. ఇండియన్ కరెన్సీలోనే చెల్లింపులు.. ఎన్ఆర్ఐల సమావేశంలో ప్రధాని మోదీ..French president Emmanuel Macron and PM Modi
Follow us
google-news-icon
Unified Payments Interface: దేశంలో 2016 నాటి నుంచి యూపీఐ సేవల వినియోగం క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. డిజిటల్ ట్రాన్సక్షన్స్ని కేవలం భారత్కి మాత్రమే పరిమితం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో విస్తరించాలని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. ఇంకా ఈ విధానమైన లావాదేవీలు ఎంతో సులభంగా, సురక్షితంగా ఉండటంతో ప్రపంచ దేశాలు సైతం యూపీఐ నెట్వర్క్లో భాగస్వామ్యం అయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ లిస్టులో తాజాగా యూరోపియన్ దేశమైన ఫ్రాన్స్ కూడా చేరింది. రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటన నిమిత్తం ఆ దేశానికి గురువారం సాయంత్రం చేరుకున్నారు ప్రధాని మోదీ. ఈ క్రమంలో ఆయన ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు.
వారితో ప్రధాని మోదీ.. త్వరలో ఫ్రాన్స్లో కూడా యూపీఐ సేవలు ప్రారంభం కానున్నాయని, ఈ విధమైన చెల్లింపుల కోసం ఇరు దేశాలు అంగీకరించ్చాయని, పారీస్ పర్యటనకు వచ్చిన భారతీయ పర్యాటకులు ఇకపై ఇండియన్ కరెన్సీలోనే చెల్లింపులు చేయవచ్చని పేర్కొన్నారు.
కాగా ఇప్పటికే యూఏఈ, భూటాన్, నేపాల్ సహా పలు ప్రపంచ దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇంకా భారత్ రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారం, 2022-23 అర్థిక సంవత్సరంలో దాదాపు రూ.139.2 ట్రిలియన్ల లావాదేవీలు జరిగాయి. అలాగే PwC నివేదికల ప్రకారం 2026-27 నాటికీ రోజువారీ లావాదేవీలు 1 బిలియన్ వరకు చేరుకునే అవకాశం ఉంది.