ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల క్రితం ఉత్తరాఖండ్లో పర్యటించిన సంగతి తెలిసిందే. అక్కడి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేతమ్రైన పితోర్గఢ్లోని పవిత్ర పార్వతీ కుండ్లో ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మోడీ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. తలపాగాతో పాటు స్థానిక సంప్రదాయ దుస్తులు ధరించి మోడీ ఈ పూజల్లో పాల్గొన్నారు. అలాగే ఢమరుకం, శంఖానాదాలతో శివుడిని ప్రార్థించారు. అనంతరం జోలింగ్కాంగ్లోని పార్వతి కుండ్ ఒడ్డున ఉన్న శివ-పార్వతీ ఆలయంలో కూడా ప్రధాని మోడీ పూజలు నిర్వహించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల క్రితం ఉత్తరాఖండ్లో పర్యటించిన సంగతి తెలిసిందే. అక్కడి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేతమ్రైన పితోర్గఢ్లోని పవిత్ర పార్వతీ కుండ్లో ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మోడీ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. తలపాగాతో పాటు స్థానిక సంప్రదాయ దుస్తులు ధరించి మోడీ ఈ పూజల్లో పాల్గొన్నారు. అలాగే ఢమరుకం, శంఖానాదాలతో శివుడిని ప్రార్థించారు. అనంతరం జోలింగ్కాంగ్లోని పార్వతి కుండ్ ఒడ్డున ఉన్న శివ-పార్వతీ ఆలయంలో కూడా ప్రధాని మోడీ పూజలు నిర్వహించారు. ఆ తర్వాత కైలాస శిఖరం ముందు కాసేపు కూర్చుని ధ్యానం చేశారు. ఆపై అక్కడి జగదేశ్వర్ ధామ్, సరిహద్దున ఉన్న గుంజీ గ్రామాన్ని కూడా సందర్శించారు. భారత్-చైనా సరిహద్దులోని పితోర్గఢ్కు వచ్చిన తొలి ప్రధాని నరేంద్ర మోడీయే కావడం విశేషం. ఈ సందర్భంగా గుంజీ గ్రామస్తులతోనూ సమావేశమయ్యారు ప్రధాని. అక్కడి గ్రామస్తులు తయారు చేస్తున్న స్థానిక ఉత్పత్తులను పరిశీలించి ప్రశంసలు కురిపించారు. అనంతరం తన పర్యటన వివరాలను ట్విట్టర్ వేదికగా అందరితో పంచుకున్నారు. ‘ఉత్తరాఖండ్లోని పితోర్ఘర్లోని పవిత్ర పార్వతి కుండ్లో దర్శనంతో నేనెంతో సంతోషించాడు. ఇక్కడ పూజలు నిర్వహించి నేనెంతో పొంగిపోయాను. ఇక్కడ జరిగిన ఆది కైలాస దర్శనంతో నా మనసు కూడా ఎంతో సంతోషించింది. ప్రకృతి ఒడిలో నెలకొని ఉన్న ఆధ్యాత్మికత, సంస్కృతికి సంబంధించిన ఈ ప్రదేశం నుంచి మన దేశంలోని కుటుంబ సభ్యులందరూ సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను’ అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
తాజాగా ఉత్తరాఖండ్ పర్యటనకు సంబంధించిన మరిన్ని ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేశాడు ప్రధాని మోడీ. ‘ఉత్తరాఖండ్లో మీరు తప్పక సందర్శించాల్సిన ప్రదేశం ఏమిటని ఎవరైనా అడిగితే.. కుమావోన్ ప్రాంతంలోని పార్వతి కుండ్, జగేశ్వర్ ఆలయాల పేర్లను చెబుతాను. వీటిని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలి. ఇక్కడి ప్రకృతి సౌందర్యం, దైవత్వం మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. నిజం చెప్పాలంటే.. ఉత్తరాఖండ్లో సందర్శించదగిన ప్రదేశాలు చాలు ఉన్నాయి. పర్యాటకులు కూడా అధికంగా ఇక్కడికి వస్తుంటారు. నేను కూడా చాలా సార్లు ఈ రాష్ట్రాన్ని సందర్శించాను. కేదార్నాథ్, బద్రీనాథ్ వంటి పవిత్ర స్థలాలకు వెళ్లాను. ఈ ప్రదేశాలు నాకెంతో మధురానుభూతిని మిగిల్చాయి. అయితే పార్వతికుండ్, జగేశ్వర్ ఆలయాలకు సందర్శించుకోవడం మాత్రం నా జీవితంలో మర్చిపోలేను’ అని రాసుకొచ్చారు మోడీ.