న్యూఢల్లీి,ఫిబ్రవరి 10 : తుర్కియే, సిరియా దేశాల సరిహద్దుల్లో సంభవించిన భారీ భూకంపం ఎంత నష్టాన్ని మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఘోర విపత్తులో ఇప్పటి వరకు 20వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. వేలాది మంది శిథిలాల కిందే చిక్కుకున్నారు. భూకంపం ధాటికి విలవిల్లాడుతున్న ఆ రెండు దేశాలకు ప్రపంచదేశాలు ఆపన్నహస్తం అంది స్తున్నాయి. ఈ దీనస్థితిని గమనించిన భారత్.. ఆ రెండు దేశాలకూ సాయం చేసేందుకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ’ఆపరేషన్ దోస్త్’ పేరిట సహాయక చర్యలు అందిస్తోంది. ఇందులో భాగంగా మందులు, ఇతర వైద్య పరికరాలు, సిబ్బందిని అక్కడికి పంపింది. సందర్భంగా భారత సైన్యం భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సేవలు అందించి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తోంది. ఈ తరుణంలో ఇండియన్ ఆర్మీ మనసుల్ని హత్తుకునే ఫోటో ఒకటి షేర్ చేసింది. కృతజ్ఞతతో కూడిన టర్కిష్ మహిళ.. సహాయక చర్యల్లో ఉన్న భారత మహిళా సైనికురాలిని హత్తుకుని.. ముద్దు పెట్టింది. ఈ ఫొటో షేర్ చేసిన ఇండియన్ ఆర్మీ ’వి కేర్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ఇది చూసి న నెటిజన్లు ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేస్తున్నారు. ఆర్మీ చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ కామెంట్లు పెడు తున్నారు. ’వారు యద్ధం కోసమే కాదు. సొంత దేశ ప్రజలను.. అవసరమైతే ఇతర దేశాలను రక్షించేందుకు ముం దుంటా రు. బిగ్ కుడోస్ టు టీమ్’ అంటూ రాసుకొస్తున్నారు.