మీ నోరు డెటాల్తో కడుక్కోండి’..
అవినీతి గురించి కాంగ్రెస్ మాట్లాడుతుండటం ఆశ్చర్యం
రాజస్థాన్ కష్టాల్లో ఉంది..తప్పులు ఎవరైనా చేస్తారు..
కాంగ్రెస్పై నిర్మలమ్మ విమర్శలు
న్యూఢిల్లీ,ఫిబ్రవరి 10 : కేంద్ర బడ్జెట్పై జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రసంగించారు.ఈ సందర్భంగా భాజపా ప్రభుత్వంపై కాంగ్రెస్ చేస్తున్న అవినీతి ఆరోపణలకు ఘాటుగా స్పందించారు. విపక్ష నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ”అవినీతి గురించి కాంగ్రెస్మాట్లాడుతుండటం ఆశ్చర్యంగా ఉంది. మీరు మీ నోళ్లను డెటాల్తో శుభ్రం చేసుకోండి భయ్యా. ఒకవేళ అలా చేసుకున్నా మీ నోళ్లు శుభ్రం కావు” అంటూ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.కొన్ని నెలల కిందట హిమాచల్ ప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే పెట్రోల్ ధరలను పెంచిందని ఆర్థిక మంత్రి దుయ్యబట్టారు. దీంతో అక్కడ ఇంధన ధరలు పెరిగాయి. ”కాంగ్రెస్సంప్రదాయం ఇదే. ఆరోపణలు చేస్తారు. సభ నుంచి వాకౌట్ చేస్తారు. అంతేగానీ ఎవరి మాట వినరు” అంటూ నిర్మలా సీతారామన్ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ బడ్జెట్ ప్రసంగంలో తప్పుల గురించి కూడా నిర్మలమ్మ ప్రస్తావించారు. ”రాజస్థాన్ కష్టాల్లో ఉంది. తప్పులు ఎవరైనా చేస్తారు. కానీ బడ్జెట్ చదవాల్సిన పరిస్థితి ఎవరికీ రాకుండా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా” అంటూ వ్యంగ్యంగా అన్నారు. రాజస్థాన్ అసెంబ్లీలో శుక్రవారం బడ్జెట్లో ప్రవేశపెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి గహ్లోత్.. కొంతసేపు పద్దులోని విషయాలనే చదవడం గందరగోళానికి దారితీసింది. ఈ తప్పిదాన్ని ఓ కాంగ్రెస్ మంత్రి గుర్తించి ప్రసంగాన్ని ఆపారు. కొంతసేపు పద్దులోని విషయాలనే చదవడం గందరగోళానికి దారితీసింది. ఈ తప్పిదాన్ని ఓ కాంగ్రెస్ మంత్రి గుర్తించి ప్రసంగాన్ని ఆపారు. కొంతసేపు పద్దులోని విషయాలనే చదవడం గందరగోళానికి దారితీసింది. ఈ తప్పిదాన్ని ఓ కాంగ్రెస్ మంత్రి గుర్తించి ప్రసంగాన్ని ఆపారు.