టాలీవుడ్ ప్రామిసింగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వైవిధ్యమైన కథలతో లు తీసే టాలీవుడ్ హీరోల్లో అతను కూడా ఒకరు. స్వామి రారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కేశవ, కిరాక్, అర్జున్ సురవరం, కార్తికేయ 2, 18 పేజెస్ లాంటి సూపర్ హిట్ లు నిఖిల్ ఖాతాలో ఉన్నాయి.
ముఖ్యంగా కార్తికేయ 2 తో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిపోయాడీ హీరో. ప్రస్తుతం స్వయంభు అంటూ మరో క్రేజీ ప్రాజెక్టుతో మన ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ త్వరలోనే పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ల సంగతి పక్కన పెడితే హీరో నిఖిల్ చేసిన ఓ పనికి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్లోని చీరాలలో కొన్ని సంవత్సరాలుగా ఓ ఆలయం మూసి ఉంది. నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ఆ ఆలయం శిథిలావస్థకు చేరువలో ఉంది. అయితే తాజాగా ఈ ఆలయాన్ని తిరిగి తెరిపించాడు నిఖిల్. ఆలయాన్ని ఓపెన్ చేయడమే కాకుండా దాని నిర్వహణ బాధ్యతలు తీసుకున్నాడు.
ఈ సందర్భంగా ఆలయాన్ని తిరిగి తెరిపించేందుకు వచ్చిన హీరో నిఖిల్ను పూలపై నడిపించి ఆహ్వానించారు గ్రామస్తులు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు నిఖిల్. ఇందులో గ్రామస్తులందరూ నిఖిల్ ను పూలపై నడిపించడం చూడవచ్చు. ఈ వీడియోను ఇన్ స్టాలో పంచుకున్న నిఖిల్.. మీకు సేవ చేసే భాగ్యాన్ని తన కుటుంబానికి కల్పించారంటూ ఆనందం వ్యక్తంచేశారు. ఆలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని గ్రామస్తులకు ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. నిఖిల్ చాలా మంచి పని చేశాడంటూ అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక స్వయంభు లో సంయుక్తా మేనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.