Narendra Modi: ప్రధాని పర్యటనలో స్వల్ప మార్పు
రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం మధ్యాహ్నం చెన్నైకి విచ్చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) పాల్గొనే
చెన్నై, Andhrapatrika ; రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం మధ్యాహ్నం చెన్నైకి విచ్చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) పాల్గొనే కార్యక్రమాల్లో భద్రతాధికారులు స్వల్ప మార్పు చేశారు. చెన్నైలో ప్రధాని మోదీ నాలుగుచోట్ల జరిగే కార్యక్రమాలలో పాల్గొనున్నారు. చెన్నై విమానాశ్రయం, సెంట్రల్ రైల్వేస్టేషన్(Central Railway Station), మైలాపూరు శ్రీరామకృష్ణమఠం, పల్లావరం సైనిక మైదానంలో ఏర్పాటయ్యే కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని అధికారులు ప్రకటించారు. నిర్దేశిత పర్యటన వివరాల మేరకు ఆయన మైలాపూరు శ్రీరామకృష్ణమఠంలో ఆ మఠం 125వ వార్షికోత్సవాల ముగింపు వేడుకలలో పాల్గొనాల్సి ఉంది. అయితే ఆ మఠానికి వెళ్లే దారి ఇరుకుగాను, వేడుకలు జరిగే ప్రాంతం విస్తీర్ణం కూడా తక్కువగా ఉండటంతో భద్రతా కారణాల దృష్ట్యా మోదీ ఆ మఠం సందర్శనను రద్దు చేశారు. అదే సమయంలో శ్రీరామకృష్ణమఠం వేడుకలను మెరీనాబీచ్(Marina Beach)లో ఆ మఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివేకానందర్ ఇల్లమ్లో జరుపనున్నారు. ఆ మేరకు ప్రధాని మోదీ తొలుత సెంట్రల్ రైల్వేస్టేషన్లో చెన్నై – కోయంబత్తూరు వందేభారత్ రైలు(Chennai – Coimbatore Vandebharat Train) సర్వీసును ప్రారంభించిన తర్వాత అక్కడి నుండి నేరుగా వివేకానందర్ ఇల్లమ్ చేరుకుని అక్కడ జరిగే శ్రీరామకృష్ణమఠం 125వ వార్షికోత్సవాల్లో పాల్గొంటారు.