తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇవాల్టి నుంచి రెండో విడత యువ గళం పాదయాత్ర ప్రారంభించనున్నారు. 79 రోజుల సుదీర్ఘ విరామం తరువాత తిరిగి సోమవారం యాత్ర ప్రారంభం కానుంది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాములో చంద్రబాబు అరెస్ట్తో సెప్టెంబర్ 9న యువగళం పాదయాత్ర నిలిచిపోయిన సంగతి తెలిసిందే.
తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇవాల్టి నుంచి రెండో విడత యువ గళం పాదయాత్ర ప్రారంభించనున్నారు. 79 రోజుల సుదీర్ఘ విరామం తరువాత తిరిగి సోమవారం యాత్ర ప్రారంభం కానుంది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాములో చంద్రబాబు అరెస్ట్తో సెప్టెంబర్ 9న యువగళం పాదయాత్ర నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ 209 రోజుల్లో 2852 కి.మీ పాదయాత్ర పూర్తి చేసిన లోకేష్.. నేటి నుంచి 210 వ రోజు తన పాదయాత్రను కొనసాగించనున్నారు. ఈరోజు ఉదయం 10.19 గంటలకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పొదలాడ నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేపట్టనున్నారు.