ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ
మార్చి 13న పోలింగ్, 16న కౌంటింగ్
న్యూఢల్లీి, ఫిబ్రవరి 9 : తెలంగాణ, ఏపీలో ఖాళీకానున్న ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది. తెలంగాణలో 2, ఏపీలో 13 ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీతో పాటు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయనున్నారు. తెలంగాణలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. హైదరాబాద్`రంగారెడ్డి ` మహబూబ్నగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది. ఈ ఎన్నికకు సంబంధించి ఈ నెల 16వ తేదీ నోటఫికేషన్ను విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 23వ తేదీ వరకు నామినేషన్లకు అవకాశం కల్పించారు. మార్చి 13న ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. 16న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇప్పటికే ఆయా ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థులు ప్రచారంలో మునిగి తేలుతున్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్థన్ రెడ్డి పదవీకాలం మార్చి 29తో ముగియనుండగా.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సయ్యద్ అవిూనుల్ హసన్ జాఫ్రీ పదవీకాలం మే 1తో పూర్తి కానుంది. అటు ఏపీలోనూ 13 ఎమ్మెల్సీ స్థానాల భర్తీ షెడ్యూల్ను ఈసీ ప్రకటించింది. అందులో 8 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు ఉండగా.. మూడు గ్రాడ్యుయేట్, 2 టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలున్నాయి. ఈ స్థానాలన్నింటికీ కూడా మార్చి 13న పోలింగ్, 16న కౌంటింగ్ జరగనుంది.