ప్రధాని మోడీపై మంత్రి కెటిఆర్ విమర్శలు
రంగారెడ్డి,అక్టోబర్ 22 (ఆంధ్రపత్రిక): కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. మోదీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరగ్గొడుతున్నాడని ధ్వజమెత్తారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని మోదీని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని మన్నెగూడలో నిర్వహించిన లారీ యజమానుల, డ్రైవర్ల ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో సరుకు రవాణా రంగం సమస్యలను అర్థం చేసుకున్నామని కేటీఆర్ తెలిపారు. కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి సరుకు లేదు. మాట్లాడితే ఇతరుల విూద నెపాన్ని తోసేస్తారు. ముడి చమురు ధర పెరగలేదు కానీ.. పెట్రోల్ ధరలు పెరిగాయి. తెలంగాణలో పెట్రోల్, డీజిల్ రేట్ల విషయంలో పన్నులు పెంచలేదు. కేంద్రమే అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ విధించి, రూ. 30 లక్షల కోట్లను తీసుకుంది. రాష్టాల్రకు వాటా ఇవ్వకుండా మొత్తం వారే తీసుకుంటున్నారని కేటీఆర్ నిప్పులు చెరిగారు. పెట్రోల్ ధరలు తగ్గించాలని ఒక ప్రెస్విూట్లో కేసీఆర్ను ఓ జర్నలిస్టు అడిగారు. పెంచిన సన్నాసే తగ్గించాలని కేసీఆర్ చెప్పారు. మోదీని డిమాండ్ చేస్తున్నా.. దోచుకున్నది చాలు.. ఇకనైన సెస్సులు రద్దు చేసి లీటర్ పెట్రోల్ను రూ. 70కి, లీటర్ డీజిల్ను రూ. 65కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్రూడాయిల్ ధరలు మారలేదు. కానీ అడిషనల్ డ్యూటీలు, సెస్సులు వేసి సామాన్యుడి నడ్డీ విరగ్గొడుతున్నడని మోదీపై కేటీఆర్ మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినప్పుడు అన్నిరేట్లు పెరుగుతాయి. నిత్యవసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మాటలు పెద్దవి పెద్దవి మాట్లాడారు. కానీ చేసిందేవిూ లేదు. ఒక్కడు ధనవంతుడైతే నల్లగొండ రూపు రేఖలు మారుతాయా అని ప్రశ్నించారు. సిలిండర్ ధర ఒకప్పుడు రూ. 400 ఇవాళ మాత్రం రూ. 1200లకు పెరిగింది. ఆయిల్ కంపెనీలకు రూ. 22 వేల కోట్ల రాయితీలు ఇచ్చారు. ఆయిల్ కంపెనీలకు రాయితీలు ఇస్తావు.. ఆడబిడ్డలకు ఎందుకు రాయితీలు ఇవ్వరు అని ప్రశ్నించారు. సెస్సులు రద్దు చేసి పెట్రోల్, డీజిల్ ధర తగ్గించాలని.. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జన్ ధన్ పేరుతో 15 లక్షలు పడతాయని కేంద్రం చెప్పింది. కాని ఒక్క లబ్దిదారుని ఖాతాలో కూడా పైసా పడలేదని చెప్పారు. గతంలో సిలిండర్ ధర రూ.400 ఉంటే ఇప్పుడు రూ.1200లకు పెంచారని మోడీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయిల్ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు ఇస్తున్నారు కాని.. ఆడపిల్లకు ఎందుకు రాయితీలు ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. ఉచిత పథకాలు మంచిది కాదని అంటారు. కానీ కార్పొరేట్ గద్దలకు పదకొండున్నర లక్షల కోట్లు మాఫీ చేసింది. కానీ అదే రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చేందుకు వెనుకాడు తున్నారు. అన్ని వర్గాలను మోదీ మోసం చేశారు. ఎనిమిదేండ్లలో మోదీ ఏం సాధించలేదు. దేశం కోసం మోదీ ఏం చేయలేదు. అన్ని కంపెనీలను అమ్ముతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణలో ఇవాళ పరిశ్రమలు పెరుగుతున్నాయి. ఉత్పత్తి అవకాశాలు పెరుగుతున్నాయి. సరుకు రవాణా అవకాశాలు పెరుగుతున్నాయి. మరింత డిమాండ్ వస్తది విూ రంగానికి. రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే ఉత్పత్తి, సంపద పెరుగుతుంది. అందరూ బాగుంటారు. అందరి విూ ముఖంలో చిరునవ్వు ఉండాలి. అన్ని రంగాల్లో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్గా ఉంది. చిల్లరమల్లర రాజకీయాలు చేసే వారికి బుద్ధి చెప్పాలి. లారీ డ్రైవర్లను, యజమానులను, కార్మికులను కడుపులో పెట్టుకుని చూసుకుంటాం. మాకు పేదలు కావాలి.. పెద్దలు కావాలి. విూ సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీజేపీ నాయకులు కావాలనే మునుగోడు ఉప ఎన్నికను తీసుకొచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. లారీ ఓనర్లు, డ్రైవర్ల సమస్యలను పరిష్కరిస్తామని హావిూ ఇచ్చారు. ఒకప్పుడు లారీ ఉందంటే ఆ వ్యక్తికి సమాజంలో చాలా గౌరవం దక్కేదని గుర్తు చేశారు. కానీ నేడు పదుల సంఖ్యలో లారీలున్నా.. లారీ ఓనర్లకు దక్కాల్సినంతా గుర్తింపు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎందరికో ఉపాధినిస్తున్న లారీ ఓనర్లను గౌరవించాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వంలో జిల్లాకో డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేశామని చెప్పారు.