కె.కోటపాడు,మార్చి29(ఆంధ్రపత్రిక): అన్న ఎన్టీఆర్ ఆశయ సాధనలో అందరం పునరంకిత మవుదామని మండల టిడిపి అధ్యక్షులు రొంగలి మహేష్ అన్నారు. టిడిపి 41వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీశ్రేణులు బుధవారం ఇక్కడి మూడురోడ్ల కూడలిలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు.పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు మార్గదర్శకంలో, యువనేత లోకేష్ అడుగుజాడల్లో మనందరం పయణించి రాష్ట్రంలో జనరంజకమైన సుస్థిర పాలనస్థాపనకు కృషి చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి మాజీ అధ్యక్షులు సబ్బవరపు రామునాయుడు, సీనియర్ నాయకులు బత్తి వెంకటరమణ, కశిరెడ్డి అప్పలనాయుడు, నాయకులు పూడి నారాయణమూర్తి,డోకల నరసింహమూర్తి, బండారు నరసింహనాయుడు, పూడి శ్రీను, భూపతి అప్పలరాజు,రెడ్డి అప్పారావు, పైల గోపి,బొజ్జ మహాలక్ష్మినాయుడు, రావాడ వెంకటరమణ, బండారు సూర్యనారాయణమూర్తి, నారెం తాతబాబు తదితరులు పాల్గొన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!