- ప్రారంభించిన సిఎం యోగి ఆదిత్యనాథ్
- లతా మంగేష్కర్ దేశం గర్వించదగ్గ గాయకురాలు
- రూ.7.9 కోట్ల వ్యయంతో నిర్మాణ కూడలి
- బుధవారం కేంద్ర టూరిజం మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ప్రారంభం
- సరయూ నది ఒడ్డున ఉన్న ఈ కూడలిలో 14 టన్నుల బరువు, 40 అడుగుల పొడవు, 12 మీటర్ల ఎత్తున్న వీణ ఏర్పాటు
- దేశంలోనే ఇంతటి భారీ సంగీత వాయిద్యాన్ని ఏర్పాటు చేయడం ఇదే ప్రథమం:సిఎం యోగి
అయోధ్య,సెప్టెంబర్28 (ఆంధ్రపత్రిక): లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్కు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా నివాళి అర్పించింది. ఆమె 93వ జయంతి సందర్భంగా యోగి ప్రభుత్వం లతా మంగేష్కర్ స్మారకార్థం ’లతా మంగేష్కర్ చౌక్ ’ను ఏర్పాటు చేసింది. రూ.7.9 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ కూడలిని బుధవారం కేంద్ర టూరిజం మంత్రి కిషన్ రెడ్డితో కలిసి సీఎం యోగి ఆదిత్యనాధ్ ప్రారంభించారు. సరయూ నది ఒడ్డున ఉన్న ఈ కూడలిలో 14 టన్నుల బరువు, 40 అడుగుల పొడవు, 12 విూటర్ల ఎత్తున్న వీణను ఏర్పాటు చేశారు. దేశంలోనే ఇంతటి భారీ సంగీత వాయిద్యాన్ని ఏర్పాటు చేయడం ఇదే ప్రథమమని అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ తెలిపారు. లతా మంగేష్కర్ దేశం గర్వించదగ్గ గాయకురాలని, ఆమె స్మారకార్థంగా చౌక్ను ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని సీఎం యోగి ఆదిత్యనాధ్ తెలిపారు.