డిసెంబర్ 27 (ఆంధ్రపత్రిక): అలనాటి అందాల తార శ్రీదేవి తనయిక జాన్వీ కపూర్ గ్లామర్ పాత్రలతో పాటు నటన ప్రధాన్యమున్న పాత్రలు చేస్తూ బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే ఆమె నటించిన ’మిల్లీ’ రిలీజై మిక్డ్స్ టాక్ తెచ్చుకుంది. కానీ జాన్వీ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు చెన్నైలోని ఓ స్టోర్ లాంచ్ ఈవెంట్కు గెస్ట్గా వెళ్లింది. ఈ ఈవెంట్ పలు విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది. కాగా ఈ కార్యక్రమంలో జాన్వీని అప్కమింగ్ సినిమాల గురించి అడగ్గా.. తాను నటిస్తున్న సినిమాలతో పాటు సౌత్ సినిమాలో నటించాలని ఆశిస్తున్నట్లు తెలిపింది. కాగా గతకొన్ని రోజుల నుండి కొరటాలశివ`ఎన్టీఆర్ సినిమాలో జాన్వీ హీరోయిన్గా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వీటిపై ఎవరూ స్పందించలేదు. కాగా తాజాగా జాన్వీ త్వరలోనే సౌత్ సినిమాలో నటించాలని ఆశిస్తున్నట్లు తెలిపింది. ఈ స్టేట్మెంట్తో హీరోయిన్గా ఆల్మోస్ట్ ఆమెనే కన్ఫార్మ్ అయినట్లు తెలుస్తుంది. దీనిపై ఫుల్ క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం జాన్వీ కపూర్ ’బావల్’, ’మిస్టర్ అండ్ మిస్టర్స్ మహీ’ సినిమా చేస్తుంది. వరుణ్ ధావన్తో కలిసి చేసిన బావల్ వచ్చే ఏడాది ఏప్రిల్ 9న రిలీజ్ కానుంది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!