పోలవరంపై సమాధానం చెబుతూ చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ అసెంబ్లీలో పోలవరంపై (Polavaram) చర్చకు సీఎం జగన్ (Jagan) సమాధానం చెప్పారు.
హైదరాబాద్: ఏపీ అసెంబ్లీలో పోలవరంపై (Polavaram) చర్చకు సీఎం జగన్ (Jagan) సమాధానం చెప్పారు. ‘‘ టీడీపీ (TDP) హయాంలో పోలవరం ఒక్క అడుగైనా ముందుకెళ్లిందా?. పోలవరం అని పలికే అర్హత కూడా చంద్రబాబుకు (Chandrababu) లేదు. వైఎస్ కంటే ముందు పోలవరం గురించి ఎవరైనా ఆలోచించారా?’’ అని జగన్ ప్రశ్నించారు. 2004కు ముందు చంద్రబాబు 9 ఏళ్లు సీఎంగా ఉన్నారని, పోలవరం అనే మాట ఆయన నోటి నుంచి వచ్చిందా? అని జగన్ మండిపడ్డారు. పోలవరం ప్రారంభించింది వైఎస్సార్.. పూర్తి చేసేది ఆయన కొడుకు అని వ్యాఖ్యానించారు. పోలవరం అంటే చంద్రబాబుకు ఏటీఎం అని, ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని మోదీ చెప్పారని జగన్ ప్రస్తావించారు.