తొలి మహిళా ప్రెసిడెంట్గా పీటీ ఉష
దిల్లీ,డిసెంబర్ 10 (ఆంధ్రపత్రిక): భారత ఒలింపిక్ సంఘంలో నూతన శకానికి పునాది పడిరది. ఒలింపిక్ సంఘం తొలి మహిళా ప్రెసిడెంట్గా పరుగుల రాణిగా పేరొందిన పీటీ ఉష (58) ( ఎన్నికయ్యారు.అధ్యక్ష పదవికి వేరెవరూ పోటీ చేయకపోవడంతో ఆమె ఎన్నిక లాంఛనమైంది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు సమక్షంలో శనివారం ఈ ఎన్నిక జరిగింది. భారత ఒలింపిక్ సంఘానికి వాస్తవానికి 2021 డిసెంబర్లోనే ఎన్నిక జరగాల్సి ఉంది. ఈ నెలలోనే ఎన్నిక నిర్వహించాలని, లేకుంటే ఐఓఏను సస్పెండ్ చేస్తామని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ హెచ్చరించింది.నిషేధం ముప్పు ఎదుర్కొని, కోర్టు జోక్యంతో ఐఓఏ కార్యవర్గం ఎన్నిక నిర్వహించారు. అధ్యక్ష పదవికి పీటీ ఉష ఒక్కరే నామినేషన్ వేశారు. ‘పయ్యోలి ఎక్స్ప్రెస్’గా పేరొందిన పీటీ ఉష.. ఆసియా గేమ్స్లో పలుమార్లు స్వర్ణ పతకం సాధించారు. 1984 లాస్ఏంజెల్స్ ఒలింపిక్స్లో 400 మీటర్ల హర్డిల్స్ ఫైనల్లో నాలుగో స్థానంలో నిలిచారు. ఈ ఏడాది జులైలో ఆమెను భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్ చేసింది. ఇప్పుడు ఒలింపిక్ సంఘం అధ్యక్ష బాధ్యతలనూ చేపట్టనున్నారు. మహరాజా యద్వీందర్ సింగ్ తర్వాత ఐఓఏ బాధ్యతలు చేపడుతున్న తొలి క్రీడాకారిణి కూడా పీటీ ఉషనే కావడం గమనార్హం. 1934లో టెస్ట్ క్రికెట్ ఆడిన సింగ్ 1938 నుంచి 60 వరకు ఐఓఏ ప్రెసిడెంట్గా వ్యవహరించారు.