ప్రజలు తిరగబడితే సీఎం జగన్ బయట తిరగలేరని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్టాన్న్రి అప్పుల కుప్పగా మార్చారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. మద్యాన్ని 25 ఏళ్ల పాటు తాకట్టు పెట్టి అప్పు తెచ్చారని దుయ్యబట్టారు. బాబాయ్ వివేకను చంపిన వ్యక్తికి ఓట్లడిగే హక్కు లేదన్నారు. వైసీపీ ఆరిపోయే దీపమని… ఇకపై జగన్ ఆటలు సాగవన్నారు. టీడీపీ ధర్మ పోరాటానికి ప్రజల సహకారం అవసరమని చంద్రబాబు పిలుపిచ్చారు. సీఎం జగన్రెడ్డి ఎక్కడు న్నావో బయటకు రావాలని, ఇకపై రాష్ట్రంలో బ్రిటీష్ పాలన సాగనివ్వనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. శుక్రవారం కుప్పంలో మూడోరోజు పర్యటించారు. కృష్ణానందపల్లి, గుండ్లనాయన పల్లి, కొత్తూరులో పర్యటన కొనసాగింది. ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఏపీలో ఉన్మాది పాలన సాగుతోందని, రాష్ట్రంలో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. నిన్నటి కుప్పం ఘటన తానెన్నడూ చూడలేదన్నారు. వైసీపీ రౌడీ మూకలతో దాడులకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ రౌడీ ప్రతాపాలు తన దగ్గర కాదు… జగన్ దగ్గర చూపించుకోవాలన్నారు. తానిచ్చిన ఇళ్లను ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. పులివెందులకు టీడీపీ హయాంలోనే నీళ్లు వచ్చాయని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. పేదలకు అన్నంపెట్టే అన్న క్యాంటీన్లను ధ్వంసం చేస్తారా? అంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పేదల పొట్టకొట్టిన వైసీపీ శ్రేణులకు మాట్లాడే అర్హత లేదన్నారు. పోలీసుల కనుసన్నల్లోనే అన్న క్యాంటీన్పై దాడి జరిగింద న్నారు. పోలీస్ వ్యవస్థ భ్రష్టు పట్టడానికి కారణం డీజీపీయేనని అన్నారు. ప్రజలకు టీడీపీ అండగా నిలబడు తుందని స్పష్టం చేశారు. కుప్పానికి నీళ్లివ్వలేని ముఖ్యమంత్రి అరాచకం సృష్టిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అన్న క్యాంటీన్లపై దాడులు చేయించి రాక్షసానందం పొందుతున్నారని ఆక్షేపించారు. వైకాపాకు ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రజలు తిరగబడితే వైకాపా నేతల పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా వైకాపాకు కొమ్ము కాయడం హేయమన్నారు. కుప్పం నియోజకవర్గంపై వైకాపా నేతలు కక్ష కట్టి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 650 గృహాలతో మోడల్ కాలనీ నిర్మాణం ప్రారంభించామని.. 1`3 విధానంలో 3వేల మందికి విస్తరించాలని ప్రణాళిక రూపొందించి అనుమతులు ఇచ్చామన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇళ్ల నిర్మాణం ఆపేశారన్నారు. కుప్పంపై సీఎంకు అభిమానం ఉంటే.. తాను 3వేల ఇళ్లు కట్టిస్తే ఆయన 10వేల ఇళ్లు కట్టించాలన్నారు. రాజకీయాలు చేస్తూ రాష్ట్రంలో అభివృద్ధి ఆపేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా సీఎం జగన్, వైకాపా నేతలపై ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరస్థుల పాలన ఎలా ఉంటుందో కుప్పంలో చూశాం. కుప్పం చరిత్రలో అది చీకటి రోజు. ఈ నియోజకవర్గంపై విూకెందుకంత కోపం. పేదవాడి పొట్టనింపే అన్న క్యాంటీన్ను ధ్వంసం చేశారు. దాని నిర్వాహకునిపై దాడి చేశారు. తమిళనాడులో అమ్మ క్యాంటీన్ ఉంటే దాన్ని ఇప్పటికీ సీఎం స్టాలిన్ కొనసాగిస్తున్నారు. హంద్రీనీవా పనుల్లో మరో రూ.50కోట్లు ఖర్చు చేసి ఉంటే నీళ్లు వచ్చేవి. నేను పులివెందులను అభివృద్ధి చేశాను. గండికోట నుంచి నీళ్లిచ్చాను అని చంద్రబాబు అన్నారు. ఈరోజు ఎమ్మెల్సీ భరత్ ఇంటి వద్ద వందల మంది పోలీసులను భద్రతగా పెట్టారు.
అదే పోలీసులను అన్న క్యాంటీన్ దగ్గర ఎందుకు పెట్టలేదు పోలీసులు సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నారు. పేదవాడికి అండగా ఉంటా.. నేను సీఎంగా ఉన్న 14 ఏళ్లు పోలీసులను ఇలాగే వినియోగించి ఉంటే నువ్వు బయట తిరిగేవాడివా వైకాపా అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో అభివృద్ధి చేయకుండా ఇప్పుడు గడపగడపకు అంటూ తిరుగుతున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే వదిలిపెట్టను. నిన్న ఎస్పీ స్థానికంగా ఉన్నప్పుడే దాడి జరిగింది. ఆ పరిణామాలకు డీజీపీ సమాధానం చెప్పాలని చంద్రబాబు అన్నారు. కాగా నమాజ్ కారణంగా చంద్రబాబు తన స్పీచ్ను ఆపేశారు. మరోవైపు కుప్పం ఘటనల నేపథ్యంలో కుప్పంలో భారీగా పోలీసులు మోహరించారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!