దిల్లీ, అక్టోబర్ 20 (ఆంధ్రపత్రిక): దేశ రాజధాని దిల్లీలో బాణసంచా నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై అత్యవ సరంగా విచారణ చేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిం స్కరించింది.దీనిపై తక్షణమే విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ప్రజలకు స్వచ్ఛమైన గాలి పీల్చుకునే వీలు కల్పించాలని వ్యాఖ్యానించిన సర్వోన్నత న్యాయ స్థానం.. టపాసుల కోసం చేసే ఖర్చుతో మిఠాయిలు కొనుక్కోవాలని సూచిం చింది. కాలుష్యాన్ని నివారించే ప్రయత్నాల్లో భాగంగా దిల్లీ రాష్ట్ర ప్రభుత్వం బాణసంచాపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిషేధాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలపై అత్యవసర విచారణ చేపట్టాలని భాజపా ఎంపీ మనోజ్ తివారీ కోర్టును అభ్యర్థించగా.. అందుకు న్యాయస్థానం నిరాకరించింది. కాగా.. టపాసుల నిషేధాన్ని వ్యతిరేకిస్తూ దిల్లీ హైకోర్టులోనూ పిటిషన్ దాఖలైంది. చివరి నిమిషంలో టపాసుల విక్రయాలు, వినియోగంపై నిషేధం విధించడం ఏకపక్షం, చట్టవిరుద్ధమని.. ఇది కొందరి జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని పిటిషనర్ ఆరోపించారు. అయితే, ఈ పిటిషన్ను విచారించేందుకు దిల్లీ హైకోర్టు నిరాకరించింది. బాణసంచాకు సంబంధించిన పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో పెండిరగ్లో ఉన్నందున తాము విచారించలేమని తెలిపింది. ఇదిలా ఉండగా.. టపాసుల నిషేధాన్ని కఠినంగా అమలు చేసేందుకు దిల్లీ సర్కారు చర్యలు చేపట్టింది. టపాసులు తయారు చేసినా, నిల్వ చేసినా, కాల్చినా.. వారికి జరిమానాతో పాటు జైలుశిక్ష విధిస్తామని పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ హెచ్చరించారు
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!