జగన్ పాలనలో చితికిపోయిన రైతులు
చాగల్నాడు, పుష్కర ఎత్తిపోతల పథకాలు నిరుపయోగం
రైతు భరోసా కేంద్రాలు రైతులపాలిట శాపం
వైసీపీ పాలనలో ఒక్క రైతు కూడా ఆనందంగా లేడు
ఏడిద గ్రామంలో రైతులతో రచ్చబండలో చంద్రబాబు
కోనసీమ,ఆగస్ట్ 17 (ఆంధ్రపత్రిక): టీడీపీ పాలనలో రైతులకే అధికారం ఇచ్చామని, జగన్ అసమర్థ పాలన రైతుల పాలిట శాపంగా మారిందని చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పనిచేయకుండా చేశారు. చాగల్నాడు, పుష్కర ఎత్తిపోతల పథకాలు నిరుపయోగంగా మార్చేశారు. మళ్లీ విూరు ఓటు వేస్తే మేము అధికారంలోకి వస్తాం అన్నారు. దేశంలో రైతులపై సరాసరి అప్పు 75 వేలు అయితే.. ఏపీలో మాత్రం 2.40 లక్షల అప్పు ఉంది. రైతు భరోసా కేంద్రాలు రైతులపాలిట శాపంగా మారాయి. వైసీపీ పాలనలో ఒక్క రైతు కూడా ఆనందంగా లేడని చంద్రబాబు అన్నారు.మండపేట మండలం ఏడిద గ్రామంలో రైతులతో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రచ్చబండ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలన తీరుపై మండిపడ్డారు. 6 నెలల్లో జగన్ ప్రభుత్వం పోతుంది. నేను ఏడిద గ్రామం వచ్చిన వెంటనే వర్షం రావటం శుభసూచికం. కరోనా సమయంలో వ్యవస్థలన్ని మూలనపడ్డాయి. రైతులు మాత్రం వ్యవసాయం ఆపలేదు. కాటన్ మహానీయుడు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నిర్మించారు. పోలవరం పూర్తయ్యి ఉంటే సాగునీరు, తాగునీరు పూర్తిస్థాయిలో అందేవి. జగన్ రివర్స్ పాలన సాగిస్తున్నారు. చివరి భూములకు నీళ్ళు వస్తున్నాయా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రచ్చబండ అనే కార్యక్రమం ద్వారా రైతులతో మాట్లాడే కార్యక్రమన్ని ప్రారంభించారు. జగన్ అసమర్థ పాలన రైతుల పాలిట శాపంగా మారిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పనిచేయకుండా చేశారన్నారు. చాగల్నాడు, పుష్కర ఎత్తిపోతల పథకాలు నిరుపయోగంగా మార్చేశారని మండిపడ్డారు. మళ్లీ విూరు ఓటు వేస్తే మేము అధికారంలోకి వస్తాం..రైతులకు మేలు జరుగుతుందన్నారు. దేశంలో రైతులపై సరాసరి అప్పు 75 వేలు అయితే.. ఏపీలో మాత్రం 2.40 లక్షల అప్పు ఉందని చంద్రబాబు గుర్తు చేశారు. . రైతు భరోసా కేంద్రాలు రైతులపాలిట శాపంగా మారాయన్నారు. వైసీపీ పాలనలో ఒక్క రైతు కూడా ఆనందంగా లేడని స్పష్టం చేశారు. కోనసీమ జిల్లా పర్యటనలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు రాజమహేంద్రవరం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు టీడీపీ కార్యకర్తలు , అభిమానులు గజమాలతో ఘన స్వాగతం పలికారు. మార్గంమధ్యలో కడియం మండలం దుళ్లలో కాటన్ దొర విగ్రహానికి పూలమాల వేసి చంద్రబాబు నివాళులర్పించారు. అనంతరం అక్కడి గ్రామదేవత చింతాలమ్మను దర్శించుకొని పూజలు చేశారు. జగన్ పిచ్చి నిర్ణయాలు అభివృద్ధికి ఆటంకం. ధాన్యం కొనుగోలు చేయలేని జగన్ మూడు రాజధానులు కడతాడంట. కోనసీమ అందాల సీమ అంటూ ఎన్నో సినిమాలు తీశారు. కోనసీమలో కొబ్బరికి జగన్ మద్దతు ధర ఇవ్వటం లేదు. జగన్ ఆక్వాసాగును నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆక్వా సాగు, రైతులు వెంటిలేషన్పై ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే రైతులకు పూర్వ వైభవం తీసుకువస్తా. ఏపీలో ఎక్కడ చూసినా గంజాయి పంట. జగన్ తిక్క శంకరయ్య పంటల భీమా కావాలని రైతులు అడుగుతున్నారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్దభేరి మోగించాను. టీడీపీ అధికారంలోకి వస్తే కరెంట్ చార్జీలు పెంచను. సోలార్ వ్యవస్థను ప్రోత్సాహిస్తాం. మందుబాబులను జగన్ మోసం చేశారు.’ అని చంద్రబాబు మండిపడ్డారు.