ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, ఫిబ్రవరి 9: స్థానిక లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కళాశాలలో ఈనెల 11న సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు కళాశాల కో చైర్మన్ లకిరెడ్డి జయప్రకాష్ రెడ్డి వెల్లడించారు. గురువారం ఆయన కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కళాశాల చైర్మన్ దివంగత బాలిరెడ్డి ఎంతో ఉన్నతాశయంతో నెలకొల్పిన ఈ కళాశాలను అదే ఆశయాలకు అనుగుణంగా నడిపిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలను రాజీలేకుండా లాభాపేక్షకు దూరంగా ఉంటూ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ కార్యమానికి ముఖ్య అతిధిగా కేంద్ర రక్షణ శాఖామంత్రి కి పరిశోధనా సలహాదారు సతీష్ రెడ్డి, APSCHE చైర్మన్ కె హేమచంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, జేయన్టీయూకే వైస్ ఛాన్సలర్ జీవీఆర్ ప్రసాద్ రాజు తదితరులు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో యల్బీఆర్ సిటీ ఛైర్మన్ జి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్ కె అప్పారావు పాల్గొన్నారు. ఫిబ్రవరి 11వ తేదీన గ్రాండ్ గా సిల్వర్ జూబ్లీ వేడుకలు జరపనున్నామని లక్కిరెడ్డి బాలిరెడ్డి కళాశాల చైర్మన్ లక్కిరెడ్డి జయప్రకాశ్ రెడ్డి మీడియాకు తెలిపారు. 180 మంది విద్యార్థులతో మొదలైన లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల నేడు 5000 మంది విద్యార్థులకు చేరువైందని, రానున్న మరి కొద్ది రోజుల్లోనే యూనివర్సిటీ చేసేదిశగా అడుగులు వేస్తున్నామని ఆయన అన్నారు. ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలకు పూర్వ విద్యార్థులు మరియు నేటి విద్యార్థులు మరియు తల్లిదండ్రులు హాజరవుతున్నట్లు తెలిపారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!