సాయికుమార్ తనయుడు ఆది సాయికుమార్ హీరోగా టాలీవుడ్కు పరిచయమైన చిత్రం ప్రేమకావాలి.
2011లో విడుదలైన ఈ ప్రేమకథా చిత్రంతోనే తెలుగు తెరకు ఇంట్రడ్యూస్ అయ్యింది ఢిల్లీ బ్యూటీ ఇషా చావ్లా.ఇందులో హీరో ఆదితో ఈ ముద్దుగుమ్మ చేసిన అల్లరి అందరికీ గుర్తుంటుంది. ఆ లో ఇషా అందానికి, అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. కూడా సూపర్ హిట్ అయ్యింది. దీంతో వెంటనే సునీల్ పూల రంగడు లో హీరోయిన్గా ఛాన్స్ దక్కించుకుంది. ఇది కూడా సూపర్హిట్గా నిలవడంతో టాలీవుడ్ లక్కీ మస్కట్గా మారిపోయింది ఇషా. అయితే ఆ తర్వాతే కథల ఎంపికలో పొరపాట్లు చేసింది ఇషా. బాలకృష్ణతో చేసిన ‘శ్రీమన్నారాయణ’, సునీల్తో చేసిన ‘మిస్టర్ పెళ్లి కొడుకు’ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్స్గా మిగిలిపోయాయి. అల్లరి నరేశ్తో కలిసి నటించిన జంప్ జిలానీ కూడా యావరేజ్ రిజల్ట్తోనే సరిపెట్టుకుంది. తెలుగులో అవకాశాలు కరువవ్వడంతో కన్నడ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. స్టార్ హీరో దర్శన్తో కలిసి విరాట్ అనే లో నటించింది. దీనికి కూడా మిక్స్డ్ టాక్ రావడంతో ఇషా ఆశలు గల్లంతయ్యాయి.కాగా 2016లో విడుదలైన విరాట్ తర్వాత ల నుంచి పూర్తిగా కనుమరుగైపోయింది ఇషా చావ్లా. గత ఏడేళ్లుగా ఒక్కటంటే ఒక్క కూడా చేయలేదు. ఆ మధ్యన త్రిష, నికిషా పటేల్ హీరోయిన్లుగా ఎం.ఎస్.రాజు తలపెట్టిన ‘రంభ ఊర్వశి మేనక’ లో ఇషాకు కూడా ఛాన్స్ వచ్చింది. అయితే ఏమైందో తెలియదు కానీ ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. అలాగే కమల్ కామరాజుతో కలిసి అగోచర లోనూ నటిస్తుందని వచ్చాయి. కానీ ఈ ఊసే లేదు. గతేడాది ఇషా లీడ్ రోల్లో బాలీవుడ్లో ఓ వెబ్సిరీస్ ప్లాన్ చేశారు ఓ డైరెక్టర్. అయితే అది కూడా ఇషాను నిలబెట్టలేకపోయింది. ఇలా లు లేకపోయినప్పటికీ సోషల్ మీడియలో మాత్రం యాక్టివ్గా ఉంటోంది ఇషా చావ్లా. తన లేటెస్ట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేసుకుంటూ ఫ్యాన్స్తో టచ్లో ఉంటోంది. అయితే గతేడాది డిసెంబర్ తర్వాత ఆమె ఇన్స్టా నుంచి ఒక్క పోస్ట్ కూడా షేర్ కాలేదు.