కె.కోటపాడు,మార్చి30(ఆంధ్రపత్రిక):మానవులకు చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లే మూగ జీవాలకుకూడా దాహం తీర్చుకునేందుకు నీరు ఏర్పాటు చేయాలని శ్రీ సత్యసాయిసంస్థల అనకాపల్లి జిల్లా అధ్యక్షులు వైశ్యరాజు కృష్ణంరాజు అన్నారు. మండలంలోని వి.సంతపాలెం గ్రామంలో శ్రీసత్యసాయి భజన మండలి ఆధ్వర్యంలో సాయి భక్తులు గురువారం ఏర్పాటుచేసిన చలివేంద్రంను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవగా గుర్తెరిగి సాయి భక్తులందరూ సేవాకార్యక్రమాల్లో తరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీసత్యసాయి సంస్థల అనకాపల్లి జిల్లా సేవా సమన్వయకర్త కశిరెడ్డి అప్పలనాయుడు,కె.కోటపాడు సమితి కన్వీనరు బండారు నారాయణపాత్రుడు, మండల విద్యావిభాగం సమన్వయకర్త రామారావు, చలంమాస్టారు, వేచలపు సింహద్రప్పడు, దేముడునాయుడు, దార్ల గుర్రన్నాచారి, కె.జె.పురం భజన మండలి కన్వీనరు చందర్రావు,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!