అమరావతి: ఏపీ సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్ (CID DG PV Sunil Kumar)పై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Chief Secretary to Govt)కి కేంద్ర హోం శాఖ (Central Home Department) లేఖ రాసింది. సునీల్ కుమార్ ఆధ్వర్యంలో సీఐడీ అధికారులు (CID Officers) అక్రమ అరెస్టులు, కస్టోడియల్ టార్చర్కు పాల్పడుతున్నారని గతేడాది కేంద్ర హోంశాఖకు హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ (High Court Advocate Gudapati Lakshminarayana) లేఖ రాశారు. సీఐడీ విభాగంలో కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్న తీరు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా ఉందని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలపై అక్రమ కేసులు మోపుతున్నారని, అధికార పార్టీ నేతల ఆదేశాల మేరకే ఈ విధంగా చేస్తున్నారని హోంశాఖకు ఫిర్యాదు చేశారు. గతేడాది అక్టోబర్లో రాసిన లేఖపై కేంద్రహోంశాఖ కార్యదర్శి స్పందించారు. ఈరోజు పోస్టులో లక్ష్మీనారాయణ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అధికారులు లేఖ పంపారు. కేంద్ర హోంశాఖ పంపిన లేఖలో ఫిర్యాదును పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!