
కరీంనగర్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay)ను కరీంనగర్ పోలీసులు (Karimnagar Police) అర్ధరాత్రి దాటిన తర్వాత అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బండి సంజయ్ అరెస్ట్పై ఆయన సతీమణి అపర్ణ స్పందించారు. అసలేం జరిగిందనేది ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి వెల్లడించారు. ఆయనను కనీసం టాబ్లెట్స్ కూడా వేసుకొనివ్వలేదని అపర్ణ పేర్కొన్నారు. పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తించారన్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పలేదన్నారు. బండి సంజయ్ అరెస్ట్ లకు భయపడరని తేల్చి చెప్పారు. తన తల్లి చిన్న కర్మలో సంజయ్ పాల్గొనకుండా చేశారన్నారు. అల్లుడు, కూతురు చేయాల్సిన కార్యక్రమాన్ని సైతం అడ్డుకున్నారన్నారు. పోలీసులను చాలా వేడుకున్నప్పటికీ వినలేదని అపర్ణ ఆవేదన వ్యక్తం చేశారు.