Author: admin

AP News: ఏముందన్నా ఆఫర్.! మందుబాబులకు సూపర్ న్యూస్.. ఇది కదా కావాల్సింది ANDHRAPATRIKA : – – మందుబాబులకు బంపర్ ఆఫర్… తాగడానికి గ్లాస్…నంజుకోవడానికి గుడ్డు…. కలుపుకోవడానికి నీరు ఫ్రీ ….రాజంపేట పట్టణంలో మందు బాబులకు ఒక బార్ దివాళి బోనాంజ ఆఫర్ ప్రకటించింది. మందు కొంటె గుడ్డు గ్లాసు వాటర్ ప్యాకెట్ ఉచితం అంటూ బ్యానర్లు వేసింది. దీంతో మందుబాబులంతా బార్ ముందు క్యూ కట్టారు…. ఇదెక్కడో తెలుసుకోవాలంటే అన్నమయ్య జిల్లా, రాజంపేటకు వెళ్లాల్సిందే. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం లో మందు ప్రియులకు ఒక బారు కిక్కు ఇచ్చే దివాళి బోనంజ ఆఫర్ ప్రకటించింది. కేవలం మద్యం బాటిల్ కొనండి సర్వం మేమే సమకూరుస్తాం అంటూ బ్యానర్లు వేసింది. మద్యం బాటిల్ కొనుక్కుంటే ఒక గుడ్డు, గ్లాసు, వాటర్ ప్యాకెట్ ఉచితమని ఆఫర్ ప్రకటించినట్లు బ్యానర్ వేయడంతో చూసే వాళ్ళు అవాక్కయ్యారు.. ఏది ఏమైనప్పటికీ మందుబాబులకు దీపావళి…

Read More

PM Modi: ఇకపై ఆ సాహసం చేయలేరు.. దీపావళి రోజున పాకిస్తాన్‌కు ప్రధాని మోదీ వార్నింగ్‌.. మామూలుగా లేదుగా ANDHRAPATRIKA :  –  – గుజరాత్‌లోని కచ్‌ తీరంలో గస్తీ కాస్తోన్న సరిహద్దు భద్రతా దళం  ( బీఎస్‌ఎఫ్ ) జవాన్లతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి వేడుకలను జరుపుకున్నారు. నేవీ బోట్‎లో కచ్‌లోని సర్ క్రీక్ ప్రాంతానికి చేరుకున్న మోదీ.. లక్కీ నాలా వద్ద మోహరించిన బీఎస్ఎఫ్ సైనికులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సైనికులకు స్వీట్లు పంపిణీ చేయడంతో పాటు కొందరికి స్వయంగా ఆయనే తినిపించారు. ప్రధాని మోదీ కూడా బీఎస్ఎఫ్ యూనిఫామ్ ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. సైనికులతో కలిసి దీపావళి పండుగ చేసుకోవడంతో తన దీపావళి తియ్యదినం మరింత పెరిగిపోతుందని సైనికులతో మోదీ అన్నారు. కచ్‌, సర్‌ క్రీక్‌ సరిహద్దులో రక్షణగా సుశిక్షితులైన సైనికులు ఉన్నారని బీఎస్ఎఫ్ జవాన్లపై ప్రధాని ప్రశంసలు కురిపించారు. సర్ క్రీక్…

Read More

కోడలిని చూసేందుకు వచ్చిన వ్యక్తిని కొట్టి చంపిన దుండగులు.. మృతదేహాన్ని ఏం చేశారంటే? ANDHRAPATRIKA : – -ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా నేరస్తుల్లో మార్పు రావడంలేదు.. రోజుకో చోట దారుణాలకు పాల్పడుతున్నారు. బీహార్‌లో ఓ ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తిని కొట్టి చంపి, తరువాత అతని మృతదేహాన్ని ఊరి బయట పడేశారు. ఈ హత్య ఘటన ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. కేసు బెగుసరాయ్‌లోని బక్రీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఒక వ్యక్తిని దుండగులు అందరు కలిసి కొట్టి చంపారు. ఆ వ్యక్తి తన కోడలిని కలవడానికి వెళ్లాడు. దుండగులు అతనిపై దాడి చేశారు. మృతుడు రతన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవీన్ షాగా గుర్తించారు. వ్యక్తి వయస్సు 40 ఏళ్లు ఉంటుందని తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నవీన్ షాని హత్య చేసి, అతని మృతదేహాన్ని విసిరివేశారు. మరణించిన వ్యక్తి నవీన్ షా ధంతేరస్…

Read More

Pin code: పిన్‌కోడ్‌ను ఎప్పుడు ప్రారంభించారు.? ఈ నెంబర్‌లో ఉన్న అర్థం ఏంటంటే.. ANDHRAPATRIKA : – – పిన్‌కోడ్ అనగానే ముందుగా గుర్తొచ్చేది పోస్టాఫీస్‌. మనం ఎవరికైనా ఉత్తరం పంపాలంటే పిన్‌కోడ్ ఉపయోగిస్తాం. అయితే ప్రస్తుతం ఆన్‌లైన్‌ మార్కెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా ఈ పిన్‌కోడ్ ఆధారంగానే మనం బుక్‌ చేసుకున్న వస్తువులను డెలివరీ చేస్తున్నాయి. అయితే అసలు ఈ పిన్‌కోడ్ ఎలా ప్రారంభమైంది.? పిన్‌కోడ్‌కు సంబంధించిన చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం.. పిన్‌కోడ్‌ను పోస్టల్ ఇండెక్స్‌ నెంబర్‌గా పిలుస్తుంటారు. భారతదేశంలో పోస్టల్ డెలివరీ సిస్టమ్‌లో ఉపయోగించే కోడ్‌. దేశంలోని ప్రతీ పోస్టాఫీస్‌కు ఒక ప్రత్యేక గుర్తింపును కేటాయించారు. ఈ అరెంకెల కోడ్‌ సహాయంతో పార్శిల్స్‌ను, లెటర్స్‌ను గమ్యస్థానానికి సులభంగా పంపొచ్చు. భారత్‌లో ఈ పిన్‌కోడ్‌ వ్యవస్థను 15 ఆగస్టు 1972న ప్రారంభించారు. ఆ సమయంలో దేశంలో పోస్టల్‌ డెలివరీ వ్యవస్థ చాలా క్లిష్టంగా ఉండేది. ఉత్తరాలను గమ్యస్థానానికి డెలివరీ…

Read More

Dulquer Salmaan: స్కూల్ జూనియర్‏కు ఫేస్‍బుక్‏లో మెసేజ్.. దుల్కర్ సల్మాన్ లవ్ స్టోరీ మాములుగా లేదుగా.. ANDHRAPATRIKA: – – మలయాళీ స్టార్ హీరో మమ్ముట్టి నటవారసుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు హీరో దుల్కర్ సల్మాన్. మలయాళంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన ఈ హీరోకు తెలుగులోనూ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దివంగత హీరోయిన్ సావిత్ర జీవితకథగా వచ్చిన మహానటి తో తెలుగు తెరకు పరిచయమయ్యాడు . ఆ తర్వాత డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహించిన అందమైన ప్రేమకథ చిత్రం సీతారామం తో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీతో మరోసారి తెలుగు అడియన్స్ హృదయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు దీపావళి పండగ సందర్భంగా లక్కీ భాస్కర్ తో థియేటర్లలో సందడి చేశాడు. ఈరోజు అక్టోబర్ 31న విడుదలైన ఈ కు ఉదయం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.…

Read More

దీపావళి పండుగ రోజు అపశృతి.. బాణసంచా పేలి ఒకరి మృతి ANDHRAPATRIKA: – – దీపావళి పండుగ రోజు ఆంధ్రప్రదేశ్ ఏలూరులో అపశృతి చోటుచేసుకుంది. ఏలూరు తూర్పు వీధి గంగానమ్మ గుడి వద్ద ఉల్లిపాయ బాంబు బస్తా పేలి సుధాకర్ అనే వ్యక్తి మృతిచెందగా, 6 గురికి తీవ్ర గాయాలైయ్యాయి. గాయపడిన వారిలో తాబేలు సాయి, సువార శశి, కే. శ్రీనివాసరావు, ఎస్కే ఖాదర్, సురేష్, సతీష్‌లు ఉన్నారు.హోండా యాక్టివా వాహనంపై ఉల్లిపాయ బాంబు బస్తా తీసుకువెళుతుండగా గోతిలో బండి పడటంతో ఒక్కసారిగా ఉల్లిపాయ బాంబులు పైకి లేచి తిరిగి బస్తాలో పడటంతో పేలుడు సంభవించింది. దీంతో వాహనం వెనుక కూర్చొని ఉన్న వ్యక్తి శరీరభాగాలు పేలుడు ధాటికి తెగిపడిపోయాయి. సమాచారం అందుకున్న ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్, వన్ టౌన్ సీఐ సత్యనారాయణ, ఎస్ఐ మదీనా బాషా సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పేలుడు…

Read More

పండగక్కి ఇళ్లంతా శుభ్రం చేశారు.. లక్షలు విలువ చేసే బంగారం చెత్తలో విసిరేశారు..! తీరా తెలిసి లబోదిబోమంటూ.. ANDHRAPATRIKA : – – దీపావళి.. పండగక్కి నెల రోజుల ముందు నుంచే ప్రజలు తమ ఇళ్లు, ఆఫీసులు, కార్యాలయాలను శుభ్రం చేసుకుంటారు. ఎక్కడా ఎలాంటి చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేసి దూరంగా పడవేస్తుంటారు. అయితే, ఈ క్లీనింగ్‌లో ఎవరైనా తమ విలువైన నగలను కూడా చెత్తతో పాటు విసిరేశారనే వార్తను మీరు ఎప్పుడైనా విన్నారా..? కానీ, నిజంగానే ఓ కుటుంబం ఇదే పని చేసింది. ఇంట్లోని ఖరీదైన ఆభరణాలను ఓ కుటుంబం చెత్తబుట్టలో పడేసింది. ఆ తరువాత గ్రహించి లబోదిబోమనాల్సి వచ్చింది. ఈ షాకింగ్‌ ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. భిల్వారా నగరానికి చెందిన చిరాగ్ శర్మ కుటుంబ సభ్యులు దీపావళి పండగ నేపథ్యంలో ఇంటిని శుభ్రం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వారి ఇంట్లోని ఒక ప్రత్యేక స్థలంలో దాచి ఉంచిన…

Read More

Gold Import: బ్రిటన్‌ నుంచి భారత్‌కు 102 టన్నుల బంగారం దిగుమతి! ANDHRAPATRIKA : – – రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కూడా ధన్‌తేరస్‌ సందర్భంగా బంగారాన్ని దిగుమతి చేసుకుంది. బ్రిటన్ నుంచి భారత్‌కు కొత్తగా 102 టన్నుల బంగారం దిగుమతి అయింది. అంతకుముందు మే నెలలో బ్రిటన్ నుంచి 100 టన్నుల బంగారాన్ని ఆర్‌బీఐ దిగుమతి చేసుకుంది. సెప్టెంబర్ చివరి నాటికి ఆర్బీఐ వద్ద మొత్తం 855 టన్నుల బంగారం ఉంది. అందులో 510.5 టన్నులు ఇప్పుడు భారతదేశంలో ఉంది. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత కారణంగా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విదేశాలలో ఉంచిన బంగారాన్ని భారతదేశానికి తీసుకువస్తోంది. తద్వారా బంగారం సురక్షితంగా ఉంటుంది. బ్రిటన్ నుంచి బంగారం ఎలా వస్తుంది? సెప్టెంబర్ 2022 నుండి భారతదేశం 214 టన్నుల బంగారాన్ని తిరిగి తీసుకువచ్చింది. ప్రభుత్వ అధికారుల ప్రకారం, ఈ నిల్వలను దేశీయంగా ఉంచడం వల్ల…

Read More

పచ్చదనం పరిశుభ్రత ANDHRAPATRIKA : –  – పచ్చదనం పరిశుభ్రత అనే నానుడి మనం అనాది కాలం నుండి ఆచరిస్తున్నాము, పెద్దలు కూడా పిల్లలను పదికాలాలు పచ్చగా ఉండాలి అని దీవెనలు ఇస్తారు, తరాలు బాగుండాలి, ప్రకృతి బాగుండాలి అని నేపథ్యం తో నేటి వాతావరణంలో చోటు చేసుకుంటున్న కాలుష్య మార్పుల దృష్ట్యా అందరూ వీలైనంత కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలని అందుకు పరిష్కారం పచ్చని చెట్లు అని తెలియచేస్తూ దీపావళి పండుగ సందర్భంగా భవానిపురం నందు ఉన్న గుంటూరు ఆక్స్ఫర్డ్ విద్య సంస్థ చేపటీనటువంటి అవగాహన కార్యక్రమం ఘనంగా విజయవంతం అయినది.ఈ సందర్భంగా ఆక్స్ఫర్డ్ విద్యాసంస్థ ప్రిన్సిపాల్ సి.హెచ్. జ్యోతి కుమారి మరియు గ్రీన్ హౌస్ ఉపాద్యాయులు, విద్యార్థులు పలువురికి మొక్కలు బహుకరించారు.

Read More

మగ మహారాజులకు అద్భుతమైన జ్యూస్.. ఓ గ్యాస్ తాగారంటే ఈ 5 విషయాల్లో ఇక తిరుగుండదు.. ANDHRAPATRIKA : – – ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. అందుకే, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మంచి జీవనశైలిని అనుసరించడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం.. నేటి కాలంలో జీవనశైలిని సమతుల్యం చేసుకోవడం ఒక సవాలుగా మారింది.. ఒత్తిడి, పనిభారం, అనారోగ్యకరమైన ఆహారం దీనికి అత్యంత కారణం.. ముఖ్యంగా పురుషులలో ధూమపానం, మద్యం సేవించడం వల్ల ఈ సమస్య చాలా రెట్లు పెరుగుతుంది. అంతేకాకుండా.. ఇది వైవాహిక జీవితంపై కూడా ప్రభావం చూపుతుంది. చెడు అలవాట్లు, పేలవమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల చాలామంది సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నారు. దీనిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవడం, వైద్య సహాయం తీసుకోవడం మంచిది. అటువంటి పరిస్థితిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, యాపిల్, బీట్‌రూట్, క్యారెట్‌లను (ABC జ్యూస్) కలిపి తయారుచేసే పోషకాహారం అద్భుతమని వైద్య…

Read More