ఇవాళ్టి నుంచి మలి దశ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన ఏపీ జేఏసీ అమరావతి
లెనిన్ సెంటర్లో నల్ల కండువాలు ధరించి పోస్టర్లు రిలీజ్ చేసి నిరసనలో పాల్గొన్న జేఏసీ చైర్మైన్ బొప్పరాజు,ఇతర నేతలు. బొప్పరాజువెంకటేశ్వర్లు,చైర్మన్ ఉద్యోగుల డిమాండ్ లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నందుకు ప్రభుత్వం సిగ్గుపడాలి. పీఆర్సీ,డీఏ బకాయిలపై స్పష్టత ఇవ్వడం లేదు. గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులను కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఉద్యోగులకు ఇచ్చే జీతాలు,పెన్షన్లపై ప్రభుత్వం తప్పు లెక్కలు చెబుతుంది.సంఘాలతో సంబంధం లేకుండా ఉద్యోగులంతా ఉద్యమంలో పాల్గొనాలి.