కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ
ఆదోని,అక్టోబర్ 19 (ఆంధ్రపత్రిక): దేశాన్ని ఏకం చేయడమే ‘భారత్ జోడో యాత్ర’ లక్ష్యమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ అన్నారు. యాత్ర ద్వారా ప్రజలతో మమేకమవుతున్నట్లు చెప్పారు.పాదయాత్రలో భాగంగా కర్నూలు జిల్లా ఆదోనిలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక నెరవేరుస్తామని స్పష్టం చేశారు.ప్రత్యేకహోదా ఇవ్వడంతో పాటు పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని రాహుల్ పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధానిగా అమరావతే ఉంటుందన్నారు. అమరావతి ప్రాంత రైతులు తనను కలిశారని.. వారి పాదయాత్రకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు