పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ ఇద్దరు పిల్లలు పుట్టాక విడాకులు తీసుకుని విడిపోయారు.
ఆ తర్వాత పవన్ కల్యాణ్ పెళ్లి చేసుకోగా.. రేణు మాత్రం ఇద్దరు పిల్లల బాధ్యత తీసుకుని సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇటీవల టైగర్ నాగేశ్వర రావు మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ తర్వాత మాత్రం ఏ సినిమా చేయకుండా రేణు దేశాయ్ జంతువులకు, అనాధ పిల్లలకు సహాయం చేసే పనిలో పడింది. గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన ఇద్దరు పిల్లలు అకీరా నందన్, ఆద్యకు సంబంధించిన విషయాలను పంచుకుంటోంది. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే అకీరా తండ్రి వెంటే ఉంటూ.. సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నాడు. అయితే ఈ ఫొటోలను రేణు దేశాయ్ కూడా తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. అయితే గత కొద్ది కాలంగా పవన్కు దూరం ఉంటున్నప్పటికీ రేణు దేశాయ్ను పవన్ ఫ్యాన్స్ పలు విధాలుగా ఇబ్బంది పెడుతున్నారని ఆమె ఎన్నోసార్లు తన ఆవేదనను వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కొంతమంది పవన్ ఫ్యాన్స్ రేణు దేశాయ్ ఏ పోస్ట్ పెట్టినా.. ఏదో ఒక కామెంట్స్, సలహాలు ఇస్తున్నారు.
ఇక ఫ్యాన్స్ చేప్పే మాటలకు విసిగిపోయిన రేణు దేశాయ్ తాజాగా, సోషల్ మీడియా వేదికగా ఓ షాకింగ్ పోస్ట్ పెట్టి ఫ్యాన్స్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ”నా ఐఫోన్లో భోగి మంట ఈ స్లో మోషన్ను చిత్రీకరించాను. డిసెంబర్ నుండి దానిపై ట్రిప్ చేస్తున్నాను. నేను ఇంకా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయలేదని మర్చిపోయాను. నేను నా మాజీ భర్తను ఎలా తిరిగి పొందాలి లేదా నేను ఇప్పటికీ అతనిని కోల్పోతున్నానని మీరు భావించినందున నేను ఈ పోస్ట్ ఎలా ఉంచాను అనే దానిపై ఏవైనా అవాంఛనీయ సలహాలు లేదా వ్యాఖ్యలు చేస్తే డిలీట్ చేస్తాను లేదా బ్లాక్ చేసిపడేస్తాను” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం రేణు దేశాయ్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన వారు కొందరు పిల్లలు అకీరా, ఆద్యలను బాగా పెంచారని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే మరికొందరు ఆమెకు సపోర్ట్గా నిలుస్తున్నారు.