తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల సమయంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీ ఎన్నికలలో 6 గ్యారంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి చురకలు అంటించిన కేటీఆర్, కాంగ్రెస్ పాలన ఫెయిల్యూర్ పాలన అంటూ తనదైన శైలిలో సోషల్ మీడియా వేదికగా ఎటాక్ చేశారు.
ఈ వస్తువులను స్టాక్ పెట్టుకోండి
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వమని బీఆర్ఎస్ ప్రభుత్వం కాదన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ప్రస్తుత కాలంలో కొన్ని ఉత్పత్తులను నిలువ చేసుకోవాలని అభ్యర్థించారు. తెలంగాణలో ఎన్నికలు ముగిస్తే వాటి అవసరం తప్పనిసరిగా ఉంటుందని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ ల లాగా, తాను ఆరు వస్తువులు చెబుతున్నానని వాటిని స్టాక్ పెట్టుకోవాలని కేటీఆర్ సూచించారు.