అహ్మదాబాద్,మార్చి 23: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ కి ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాని మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో గుజరాత్ సూరత్ కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన న్యాయస్థానం.. రెండేండ్లు జైలు శిక్ష విధించింది. మోదీ ఇంటి పేరును ఉద్దేశించి కర్ణాటకలో 2019 లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు. దొంగలందరి ఇంటిపేరు మోదీయే ఎందుకంటూ..? ఆయన ప్రశ్నించారు. దీనిపై గుజరాత్ బీజేపీ నేతలు కోర్టుకు వెళ్లారు. రాహుల్పై పరువునష్టం కేసు వేశారు. ఈ కేసులో నేడు విచారణ జరిపిన సూరత్ కోర్టు రాహుల్ను దోషిగా తేల్చింది. ఈ మేరకు రాహుల్కు రెండేండ్ల జైలు శిక్ష విధించింది. ప్రధాని మోడీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ విషయంపై ఆయన మొదటిసారి స్పందించారు. తన మతమనేది సత్యం, అహింసపై ఆధారపడిరదని, సత్యమే తన దేవుడని, అహింసే దానిని పొందే సాధనమనే మహాత్మా గాంధీ కోట్ ను రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. 2019లో కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ, ప్రధాని ఇంటి పేరుపై తీవ్ర కామెంట్లు చేశారు. దేశంలోని దొంగలందరి ఇంటి పేర్లు మోడీ అనే ఎందుకు ఉంటాయంటూ ఆయన అప్పట్లో అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే, గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేష్ మోడీ రాహుల్ గాంధీపై పరువునష్టం కేసు వేశారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన సూరత్ కోర్టు.. తాజాగా ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ వెంటన్ 30 రోజుల బెయిల్ ను మంజూరు చేసింది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!