కె.కోటపాడు,ఏప్రిల్07(ఆంధ్రపత్రిక):జనసేనపార్టీ అధినేతపవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు “డొక్కా సీతమ్మ ఆహారనిధి” కార్యక్రమంలో నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో రాయపరెడ్డి ఫౌండేషన్ ద్వారా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తామని జనసేనపార్టీ మాడుగుల నియోజకవర్గం నాయకులు రాయపరెడ్డి కృష్ణ చెప్పారు. గురువారం ఆయన ఇక్కడి షిర్డీ సాయి బాబా మందిరం వద్ద అన్నదానంచేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నెలలో తొలి గురువారం ఇక్కడి బాబా మందిరం దగ్గర, మిగతా మూడువారాలు దేవరాపల్లి, మాడుగుల, చీడికాడ మండలాల్లో రాయపురెడ్డి ఫౌండేషన్ ద్వారా ఈ అన్నదాన కార్యక్రమం చేస్తామని తెలిపారు.రాయపురెడ్డి ఫౌండేషన్ ద్వారా అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం హర్షణీయమని జనసైనికులు అన్నారు. ఈ కార్యక్రమంలో మండలం జనసేన నాయకులు కుంచా అంజిబాబు, చుక్కా సూర్యనారాయణమూర్తి, బొట్ట పాలవెల్లి, ఉమామహేష్,శివాజీ, శ్రీను, చైతన్య, సూర్య, వరహాలరాజు, మండల జనసైనికులు,వీర మహిళలు, తదితరులు పాల్గొన్నారు
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!