ముస్లీంలు పాటించే ఉపవాసాన్ని ‘రోజా’ అంటారు. ఈ నెలలో, ముస్లిం ప్రజలు ఉదయం సెహ్రీ సమయంలో ఆహారం తీసుకున్న తర్వాత రోజంతా ఆకలితో , దాహంతో ఉంటారు. ఖర్జూరం తినడం ద్వారా మాత్రమే ఉపవాసం విరమిస్తారు.పవిత్ర రంజాన్ మాసం కొనసాగుతోంది. మార్చి 24 నుంచి రంజాన్ నెల ప్రారంభం అయ్యింది. ముస్లీంలు పాటించే ఉపవాసాన్ని ‘రోజా’ అంటారు. ఈ నెలలో, ముస్లిం ప్రజలు ఉదయం సెహ్రీ సమయంలో ఆహారం తీసుకున్న తర్వాత రోజంతా ఆకలితో, దాహంతో ఉంటారు. దీని తరువాత, సాయంత్రం ఉపవాసం విరమిస్తారు. ఉపవాసం విరమించే సమయంలో ముస్లీం సోదరులు కొన్ని ఆచారాలు కూడా పాటిస్తారు. ఖర్జూరం తినడం ద్వారా మాత్రమే ఉపవాసం విరమిస్తారు. ఆ తర్వాత ఇతర ఏ పదార్థాలైన తింటారు. ఖర్జూరం తిన్న తర్వాతే ఎందుకు రోజా విరమిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉపవాస సమయంలో ఏదైనా తినడం లేదా త్రాగడం నిషేధించబడింది. సాయంత్రం ఉపవాసం విరమించేటప్పుడు ఎక్కువ ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఈ కారణంగా, ఉపవాసం విరమించేటప్పుడు ఖర్జూరాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఎందుకంటే ఖర్జూరం శరీరంలోని పోషకాల లోపాన్ని భర్తీ చేస్తుంది. దీనితో పాటు, ఖర్జూరం తినడం వల్ల శరీరానికి చాలా శక్తి లభిస్తుంది, ఇది రోజంతా ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరంలోని బలహీనతను తొలగించడంలో సహాయపడుతుంది.రంజాన్లో ఖర్జూరం తిని ఉపవాస దీక్ష విరమిస్తారు.. ఇది ఇస్లాంలో సున్నత్గా పరిగణిస్తారని AMU మాజీ థియాలజీ ప్రెసిడెంట్ ముఫ్తీ జాహిద్ అలీ చెప్పారు. ఖర్జూరం హజ్రత్ మొహమ్మద్ ప్రవక్తకు ఇష్టమైన పండు. ఆయన ఖర్జూరం తిని ఉపవాసం విరమించేవాడు. అందుకే నేటికీ ముస్లీం సోదరులంతా .. ఖర్జూరం తిని ఉపవాసం విరమిస్తారు.