మహారాష్ట్ర, మార్చి17(andhrapatrika): మహిళా ప్రయాణీకులకు గుడ్ న్యూస్ చెప్పింది మహారాష్ట్ర ప్రభుత్వం. తమ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్ని రకాల బస్సులలో నేటి నుంచి మహిళా ప్రయాణీకులకు బస్సు టిక్కెట్లపై 50% తగ్గింపు ఇస్తున్నామని స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సంస్థ ప్రకటించింది. శుక్రవారం ఉదయం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ‘‘మహిళా సమ్మాన్ యోజన’’ కింద మహిళలు అందిస్తున్న ఈ ప్రయోజనం పొడిగించబడుతుందని పేర్కొంది. ఇలా మహిళలు బస్సు టికెట్స్ లో రాయితీ ఇస్తున్నందనున ఆ రాయితీ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం .. ఆర్టీసీ కార్పొరేషన్కు తిరిగి చెల్లిస్తుందని పేర్కొంది. మార్చి 9న 2023-24 సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక ప్రణాళికను ప్రవేశపెడుతున్నప్పుడు.. ఆర్ధిక శాఖను నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి.. దేవేంద్ర ఫడ్నవిస్ మహిళల కోసం అంటూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికులందరికీ 50% రాయితీని ప్రకటించారు. మహారాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లో 15,000 బస్సులు, ఫెర్రీలు కలిసి రోజుకి 50 లక్షల మంది ప్రయాణికులను రవాణా చేస్తాయి. అయితే ఇప్పుడు ఈ సంస్థ వివిధ సామాజిక గ్రూప్స్ కి చెందిన టిక్కెట్లపై 33% నుండి 100% వరకు తగ్గింపులను అందిస్తుంది. అయితే ఇప్పడు ప్రభుత్వం స్త్రీలకు టికెట్స్ లో రాయితీ ఇస్తున్న విషయంపై %వీూRుజ% అధికారులు స్పందించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందే మహిళల సంఖ్యను అంచనా వేయడం కష్టమని పేర్కొన్నారు. మహిళా ప్రయాణీకుల్లో నివాసితుల సంఖ్య .. రవాణా వినియోగదారుల్లో 35-40 శాతం పరిధిలో ఉంటుందని %వీూRుజ% అంచనా వేస్తున్నట్లు తెలిపారు. భారతదేశం 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవం సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు 100 శాతం రాయితీని.. 65 మరియు 74 సంవత్సరాల మధ్య వయస్సు గల ప్రయాణికులకు అన్ని %వీూRుజ% బస్సులపై 50 శాతం తగ్గింపును అందించిన సంగతి తెలిసిందే. అయితే మనదేశంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించిన మొదటి ప్రభుత్వం ఢల్లీిలో క్రేజివాల్ సర్కార్.ఇటీవల కర్ణాటక సీఎం రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మంది శ్రామిక మహిళలకు ఉచిత బస్ పాస్ సౌకర్యం ప్రకటించారు. సంఘటిత రంగంలో పనిచేస్తున్న మహిళలందరికీ ఉచిత బస్ పాస్లు అందించాలని కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించింది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!