andhrapatrika ; శుక్రవారం స్థానిక ఈడేపల్లి బి.సి సంక్షేమ సంఘం కార్యాలయంలో ఎం ఎల్ సి దివంగత బచ్చుల అర్జునుడు చిత్రపటానికి పూలమాలలు వేసి బిసి నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు శేకుబోయిన సుబ్రమణ్యం మాట్లాడుతూ బచ్చుల అర్జునుడి మృతితీరని లోటు అన్నారు.కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్సీ వరకు ఎదగడంఅర్జునుడి క్రమశిక్షణకు నిదర్శనంగా పేర్కొన్నారు. ఎల్లప్పుడూ బీసీలకు వెన్నుదన్నుగా నిలిచేవారని కొనియాడారు. మచిలీపట్నం చైర్మన్ గా పట్టణాభివృద్ధికి ఎనలేని కృషి చేశారని తెలిపారు. మాట ఇస్తే మడమ తిప్పని నాయకునిగా పేరు తెచ్చుకున్నారన్నారు. అటువంటి మహనీయుని మృతి రాష్ట్ర ప్రజలకు తీరని లోటని సుబ్రమణ్యం ఆవేదన వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో బిసి పట్టణ అధ్యక్షులు తోట బాబు, ఎల్ఐసి రాంబాబు,జోగి శివ, జన్ను గోవిందు, చేబోయిన కోటేశ్వరరావు, పుట్టి రాజశేఖర్, పోలగాని వెంకటేశ్వరరావు,యు. సందీప్ తదితర బీ.సీ నాయకులు పాల్గొన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!