పెరుగుతున్న కేసులతో ఆందోళన
1300 మందికి పాజిటివ్గా గుర్తింపు
ప్రస్తుతం దేశంలో 7,605 యాక్టివ్ కేసులు
మొత్తం కరోనా మృతుల సంఖ్య 5,30,816
న్యూఢల్లీి, మార్చి 23 : దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగు తున్నాయి. గత కొన్ని రోజులుగా అదుపులోనే ఉందనుకున్న మహ మ్మారి మరోసారి కోరలు చాస్తోంది. గత ఐదు రోజులుగా వెయ్యి చేరు వలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడిరచిన వివరాల ప్రకా రం.. గత 24 గంటల్లో 89,078 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా.. ఏకంగా 1,300 మందికి పాజిటివ్గా తేలింది. ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం 140 రోజుల తర్వాత ఇదే మొదటిసారి. తాజా కేసులతో దేశంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడినవారి సంఖ్య 4,46,99, 418కి చేరింది. ప్రస్తుతం దేశంలో 7,605 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24 గంటల్లో కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ముగ్గురు మృతి చెందారు. తాజా మరణాలతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 5,30,816కి చేరింది. ఇక కరోనా మహమ్మారి నుంచి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 4,41,60,997 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో 0.02 శాతం మాత్రమే యాక్టివ్గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడిరచారు. రికవరీ రేటు 98.79 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.65 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడిరచింది.