ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చిన తరువాత భారతదేశంలో ఆన్లైన్ రిటైల్ మార్కెట్ వేగంగా వృద్ధి చెందింది.ఇదే క్రమంలో ఆన్లైన్ మోసాలు కూడా పెరుగుతున్నాయి.
ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రభుత్వం కఠినమైన చర్యలను తీసుకోవడానికి కసరత్తులు చేస్తోంది.ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, త్వరలోనే కఠినమైన నిబంధనలు జారీ చేసే అవకాశం కలదు.
అమెజాన్, ఫ్లిప్కార్ట్( Amazon, Flipkart ) సహా అన్ని ఈ-కామర్స్ కంపెనీలకు నిబంధనలను కఠినతరం చేయడానికి కేంద్ర వినియోగదార్ల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కసరత్తు చేసినట్టుగా కనబడుతోంద
ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ లలో జరిగే మోసాలకు సంబంధిత కంపెనీలను బాధ్యులను చేసే పనిలో కేంద్రం పనిచేసుకుంటూ పోతోంది.ఒక కంపెనీకి చెందిన ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ( E-commerce platform )విక్రేత వల్ల వినియోగదారు మోసపోతే, సంబంధిత సంస్థ మధ్యవర్తి పాత్రను పోషించడంలో విఫలమైనట్లుగా పరిగణిస్తారు.ఈ క్రమంలో ఆన్లైన్ షాపింగ్ మోసాలకు సంబంధించి, కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ-కామర్స్ కంపెనీలకు కొన్ని ప్రశ్నలను పంపింది.ఆ ప్రశ్నలపై ఆయా కంపెనీల నుంచి సమాధానాలు రాగానే నిబంధనలను అమలు చేయనున్నార
కేంద్ర వినియోగదార్ల వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూపొందించిన ప్రశ్నల ఆధారంగా ఆ నోట్ రూపొందించారని విశ్వసనీయ వర్గాల సమాచారం.ఆ ప్రశ్నల్లో ముఖ్యమైన ప్రశ్న ఏమంటే, మధ్యవర్తిగా ఆయా కంపెనీల పాత్రను స్పష్టం చేయాలని మంత్రిత్వ శాఖ అడిగింది.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లోని సెక్షన్ 79 ప్రకారం.
కొనుగోలుదార్లు – అమ్మకందార్లను అనుసంధానించే మధ్యవర్తులుగా ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లను పరిగణిస్తారు.సంబంధిత సెక్షన్ కింద వినియోగదార్లకు కొంత రక్షణ మాత్రమే లభిస్తుంది.
అయితే, ఈ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం మార్చాలని అనుకుంటోంది.